ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారు, వరుడు మైనర్ అంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు
అబ్బాయికి 18 ఏళ్ళు, అమ్మాయికి 24 ఏళ్ళు, వారిద్దరూ ఇష్టపడ్డారు. దీంతో పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అమ్మాయికి, అబ్బాయికి ఏకంగా ఆరేళ్ళ తేడా ఉండడంతో వరుడి బంధువులు ఈ పెళ్ళికి ఇష్టపడలేదు.
మైసూర్:అబ్బాయికి 18 ఏళ్ళు, అమ్మాయికి 24 ఏళ్ళు, వారిద్దరూ ఇష్టపడ్డారు. దీంతో పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అమ్మాయికి, అబ్బాయికి ఏకంగా ఆరేళ్ళ తేడా ఉండడంతో వరుడి బంధువులు ఈ పెళ్ళికి ఇష్టపడలేదు. దీంతో ప్రేమికులు దేవాలయంలో పెళ్ళి చేసుకొన్నారు.
మైసూర్ లోని మోహల్లాకు చెందిన ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ఒకేచోట పనిచేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.కొద్దికాలం సరదాగా తిరిగారు.
ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసింది. కనీస వివాహ వయస్సు కూడ రాని అబ్బాయికి వివాహం చేయబోమని తేల్చిచెప్పారు. అయితే పెద్దలు ఈ పెళ్ళికి అంగీకరించబోరని భావించిన ప్రేమికులు పెళ్ళి చేసుకొన్నారు.
ఆదివారం నాడు స్థానికంగా ఉన్న సయ్యాజీరావు రోడ్డులోని సత్యనారాయణరావు ఆలయంలో దండలు మార్చుకొని వివాహం చేసుకొన్నారు.
దీంతో వరుడి తల్లిదండ్రులు , బంధువులు వచ్చి తమ కుమారుడు మైనర్ అని, అతడికి బలవంతంగా పెళ్ళి చేశారని మండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమికులను పిలిపించి విచారణ చేశారు.అయితే తమ ఇష్టప్రకారంగానే పెళ్ళి చేసుకొన్నట్టు ప్రేమికులు చెప్పారు.