వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జిఎస్టీ ద్వారా సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ ఆదాయం రూ.92,150
కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీఎస్టీని అమలులోకి తెచ్చింది. ముగిసిన సెప్టెంబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.92,150కోట్ల ఆదాయం లభించింది.
న్యూఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీఎస్టీని అమలులోకి తెచ్చింది. ముగిసిన సెప్టెంబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.92,150కోట్ల ఆదాయం లభించింది.
42.91లక్షల వ్యాపారాల ద్వారా ఈ మొత్తం లభించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివరాలు తెలిపింది. ఇందులో రూ.14,042 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.21,172 కోట్లు స్టేట్ జీఎస్టీ. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా రూ.48,948 కోట్లు, దిగుమతుల కింద రూ.23,951 కోట్లు వచ్చాయి.
కాగా, ఈ ఏడాది జులైలో జీఎస్టీ అమల్లోకి రాగా మొదటి నెలలో రూ.95వేల కోట్లు, రెండో నెలలో రూ.91వేల కోట్లు వచ్చాయి. ఇప్పుడు రూ.92 వేల కోట్లు వచ్చాయి.
Comments
English summary
The government has collected Rs 92,150 crore as Goods and Services Tax (GST) in September from 42.91 lakh business, the finance ministry said on Tuesday.
Story first published: Tuesday, October 24, 2017, 21:34 [IST]