జీఎస్టీ మండలిలో 26వ సమావేశం.. కీలక నిర్ణయాలు!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జీఎస్టీ మండలి 26వ సమావేశం జరిగింది. సమావేశంలో జీఎస్టీ రిటర్న్ల సరళీకరణపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ అంశంపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. జీఎస్టీఆర్ 3బీ ఫైలింగ్ను మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ గల సరుకులు రవాణా చేయాలంటే ఉండాల్సిన ఎలక్ట్రానిక్-వే బిల్లుపై కీలక వివరాలు తెలిపారు.
ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ పన్నుల ఎగవేతకు పాల్పడుతోన్న ప్రక్రియను ఈ ఈ-వే బిల్లు ద్వారా అరికట్టవచ్చని జైట్లీ చెప్పారు. ఎలక్ట్రానిక్-వే బిల్లును వచ్చే నెల 1 నుంచి దశల వారీగా అమల్లోకి తీసుకొస్తామని, ఈ ఏడాది జూన్ 1 నాటికి దేశవ్యాప్తంగా ఈ-వే బిల్లు అమల్లోకి వస్తుంది తెలిపారు.