వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిఎస్టీ ఎఫెక్ట్: నేటి నుండి ఈ వే బిల్లు విధానం అమల్లోకి

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బడ్జెట్ రోజునే దేశంలో ఈ-వే బిల్లు విధానం కూడా అమలులోకి వచ్చింది. జీఎస్టీ ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకులను రవాణా చేయాలంటే ఫిబ్రవరి 1నుంచి ఎలక్ట్రానిక్‌ వే బిల్లు తప్పనిసరి.

Recommended Video

Union Budget 2018 : Arun Jaitley's Fifth Union Budget

ఒక ఇ-వే బిల్లు 100 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి ఒక రోజు చెల్లుతుంది. దీని తరువాత ప్రతి 100 కిలోమీటర్లకు, ఆయా తేదీ నుండి ఒక రోజుకు చెల్లుబాటు అవుతుంది. ఈ-వే బిల్లును 24 గంటలలో రద్దు చేయవలసి ఉంటుంది.

GST e-way bill to go live on budget day, industry fears disruption

పన్నుల ఎగవేతను నిరోధించడం కోసమే రూపొందించిన ఈ-వే బిల్లు విధానం ,జీఎస్టీ రూపకల్పనలో కీలక అంశంగా పేర్కొన్నారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జరిగిన 24వ జీఎస్టీమం డలి సమావేశంలో ఈ-వే బిల్లులను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మేరకు జనవరి 15 నుంచే ఈ-వే అమలును ప్రయోగాత్మకంగా చేపట్టారు. పలు రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతమైనట్లు జీఎస్టీ నెట్‌వర్క్‌ సీఈవో ప్రకాశ్‌ కుమార్‌ తెలిపారు. గత 15 రోజుల్లో సుమారు 2.84 కోట్ల ఈ-వే బిల్లులు జారీ అయ్యాయి.

జనవరి 30న గరిష్టంగా 3,40,000 ఈవే బిల్లులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ట్రాన్స్‌పోర్టర్లు, పన్నుచెల్లింపుదారులు అంతా కలిపి 6.70లక్షల మంది ఈ-వే బిల్లు విధానంలో పేర్లను నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అంతర్రాష్ట్ర రవాణాకు ఈ-వే బిల్లు తప్పనిసరి. జూన్‌1 నుంచి రాష్ట్రంలో అంతర్గత రవాణాలకూ ఈ-వే బిల్లు వర్తించనుంది.

కాగా, రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకుల రవాణాకు ఈ-వే బిల్లును తప్పినిసరి చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. రూ.5లక్షలకు మించి విలువ కలిగిన సరుకులకు మాత్రమే వర్తింపజేయాలని, ఈ-వే బిల్లు చెల్లుబాటు గడువును 24 గంటలు(ఒక రోజు) కాకుండా ఐదు రోజులకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

English summary
The e-way bill, key to preventing tax evasion under the goods and services tax (GST), will be rolled out nationwide from Thursday, the day finance minister Arun Jaitley will present the Union Budget 2018, amid persistent concerns in some quarters that its enforcement could trigger fresh economic disruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X