తండ్రి కాదు కసాయి: కన్న కొడుకులనే కడతేర్చాడు...అసలేం జరిగింది..?
గుజరాత్ : గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసే నేరస్తుడిగా మారాడు. అది కూడా ఎవరిపైనో ఆయన దాడి చేయలేదు. తన సొంత కుటుంబం అది కూడా తన కన్న కొడుకుల గొంతు కోసి హత్య చేశాడు. ముగ్గురు 8 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వయసున్న చిన్నారులు కావడం విశేషం. ఆదివారం రోజున తన భార్యతో గొడవ పడిన పోలీస్... ఆ కోపం ఎలాంటి పాపం తెలియని ముగ్గురు చిన్నారులపై చూపాడు. వారిని ఈ లోకంలో లేకుండా చేశాడు. ముగ్గురు పిల్లలను చంపి తనే పోలీసులకు ఫోన్ చేశాడు. తన సహచరులు పోలీస్ క్వార్టర్స్లోని ఇంటికి చేరుకోగానే షాక్కు గురయ్యారు.
సుప్రీంకోర్టుకు చిదంబరం..నేటితో ముగియనున్న సీబీఐ కస్టడీ
ఆదివారం రోజున తన భార్యతో గొడవ పడ్డ సుఖ్దేవ్ అనే ఈ పోలీసు తన భార్యను మరో గదిలో ఉంచి తాళం వేశాడు. ఆ తర్వాత ముగ్గురు కుమారులు కుశల్ (8), ఉద్దవ్ (5) మరియు మన్మీత్ (3)ల గొంతు కోసి హత్య చేశాడు. ఇక ముగ్గురిని హత్య చేశాక పోలీస్ స్టేషన్కు స్వయంగా సుఖ్దేవ్ ఫోన్ చేశాడు. ఇక ఇంటికి చేరుకున్న పోలీసులు ఓ గదిలో ఉన్న సుఖ్దేవ్ భార్యను బయటకు తీసుకొచ్చారు. సుఖ్దేవ్ మాత్రం కత్తిపట్టుకుని ఓ మూలన కూర్చుని ఉండటాన్ని పోలీసులు గమనించారు.
ఇక రక్తపు మడుగులో ముగ్గరు చిన్నారుల మృతదేహాలు పడిఉండటాన్ని చూసి షాక్కు గురయ్యారు తోటి పోలీసులు. శుక్రవారం రోజున తన భార్యతో పెద్ద గొడవ జరిగిందని పోలీసులకు తెలిపారు. ఆ రోజున తన పెద్ద కుమారుడి పుట్టిన రోజుని చెప్పాడు. అంతకు ముందే అంటే శుక్రవారంకు ముందే ఓ సారి గొడవ పడినట్లు వెల్లడించాడు. అసలు గొడవకు దారితీసిన కారణాలేంటనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ సుఖ్దేవ్ సియాల్ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.