హార్దిక్ పటేల్కు షాక్: ‘పాస్’కు మరో కీలక నేత దినేష్ రాజీనామా
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్కు కొద్ది గంటలు మాత్రమే మిగిలుండగా పాటిదార్ ఉద్యమనేత హార్ధిక్ పటేల్కు ఊహించని షాక్ తగిలింది. పాటిదార్ అనామత్ అందోళన్ సమితి (పీఏఏఎస్-పాస్)లో కీలక సభ్యుడు, హార్థిక్ పటేల్కు అత్యంత సన్నిహిత వ్యక్తి అయిన దినేష్ బంభూనియా పాస్కు రాజీనామా చేశారు.
శనివారమే ఎన్నికల పోలింగ్ ఉండగా, ఈ సమయంలో పాస్కు దినేష్ రాజీనామా చేయడం హార్ధిక్కు, ఆయన మద్దతిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా భారీ దెబ్బకు అని విశ్లేషకులు చెబుతున్నారు. పటేల్ అనామత్ ఆందోళన్ సమితి నుంచి వైదొలిగిన కీలక నేతల్లో దినేష్ నాలుగోవారు కావడం గమనార్హం.
కాగా, పటేల్ ఆందోళనలో కీలక పాత్ర పోషించిన అమ్మీష్, కేతన్లు గత నవంబర్లోనే పాస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం వారిద్దరు బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పీఏఏఎస్ కన్వీనర్ అయిన వరుణ్ పటేల్కూడా హార్థిక్కు దూరంమై.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా, తొలిదశ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కీలక నేతల రాజీనామాలు హార్దిక్ పటేల్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.