అభివృద్ధి గురించే మాట్లాడండి: మోడీపై మరోసారి శత్రుఘ్న సెటైర్లు
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి ఆయన సొంత పార్టీ అయిన బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా నుంచి సూచనలు వచ్చాయి. కాగా, మోడీ లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యాఖ్యలుండటం గమనార్హం.
ఓ కాంగ్రెస్ నేత పాకిస్థాన్ హై కమిషనర్, జనరల్స్తో భేటీ అయ్యాడని మోడీ చేసిన వ్యాఖ్యలపై శత్రుఘ్న స్పందించారు. ప్రధాని మోడీ పాలన్పూర్ ర్యాలీలో మాట్లాడుతూ.. ఇటీవల సస్పెండ్కు గురైన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ రహస్యంగా పాకిస్థాన్ హైకమిషనర్, మిలిటరీ అధికారులను కలిశారని, అహ్మద్ పటేల్ను గుజరాత్ సీఎం చేయాలనే ఈ భేటీలో చర్చించారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై శత్రుఘ్న సిన్హా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'గౌరవనీయులైన మీరు.. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేయవచ్చు. అనసవసరమైన ఆరోపణలు కాకుండా అభివృద్ధి నినాదంతో ముందుకెళితే బాగుంటుంది. ప్రత్యర్థులపై పాకిస్థాన్ ఆరోపణలు సరికావు' అంటూ మోడీకి హితవు పలికారు.
Hon'ble Sir!
— Shatrughan Sinha (@ShatruganSinha) December 11, 2017
Just to win elections anyhow, and that too at the fag end of the process, is it a must to come up with & endorse new, unsubstantiated & unbelievable stories everyday against political opponents? Now linking them to Pak High Commissioner & Generals?! Incredible!.1>2
అనవసరమైన కథలు చెప్పడం కంటే చేసిన అభివృద్ధి గురించి, చేయబోతున్న అభివృద్ధి గురించి వివరించాలని శత్రుఘ్న సిన్హా... ప్రధానిని కోరారు. కమ్యూనలైజ్ చేయడం మాని, ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేయాలంటూ హితవు పలికారు.