నాటి ఘటనను మరిచిన 'గోద్రా', ఐనా బీజేపీకి ఎదురుగాలి: ఎందుకంటే
అహ్మదాబాద్: గోద్రా అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి గోద్రా ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్ నుంచి దాదాపు 150 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. గత కొద్ది కాలంగా ఇక్కడ ఎలాంటి మార్పులు కనిపించడం లేదనే వాదనలు ఉన్నాయి. అభివృద్ధికి దూరంగా ఉందని అంటారు.
Recommended Video

2002లో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలులో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న వారిలో 51 మంది సజీవ దహనం అయ్యారు. ఆ తర్వాత అహ్మదాబాద్, గుజరాత్లలోని పలు నగరాల్లో జరిగిన మత కల్లోహాల్లో ఎన్నో ప్రాణాలు పోయాయి. ఈ ఘటన జరిగి పదిహేనేళ్లవుతోంది.

బీజేపీకి తిరుగు లేదు కానీ
గుజరాత్లో గత రెండు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగు లేదు. 2002 నుంచి మోడీ నేతృత్వంలో కమలం పార్టీ గుజరాత్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసంది. గోద్రాలో మాత్రం గత రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ అత్యధికులు ముస్లీంలు. ఇప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెబుతున్నారు.

గోద్రోలో బీజేపీకి వ్యతిరేకంగా గళం
గోద్రా పంచమహల్ లోకసభ నియోజకవర్గ పరిధిలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. షెర్వా, మోర్వా, హడఫ్, గోద్రా, కలోల్, హలోల్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారని అంటున్నారు.

ఆ ప్రభావం వల్లే
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చాలా పరిశ్రమలు మూతపడ్డాయని, వేల మంది రోడ్లపైకి వచ్చారనే విమర్శలు ఉన్నాయని చెబుతున్నారు. కాగా, గోద్రా, తదనంతర ఘటనలను తాము మరిచిపోయామని, ఇక్కడ అందరం కలిసి మెలిసి ఉంటున్నామని స్థానికులు చెబుతున్నారు.

గోద్రా చూసేది ఇవే
అయితే జీఎస్టీ, నోట్ల రద్దు తర్వాత ప్రభావంతో ఇక్కడి వారు ఇబ్బందులకు గురవడంతో మరోసారి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని అంటున్నారు. మరోవైపు, గోద్రాలోని వారు ఇప్పుడు ఉద్యోగాలు, విద్యుత్ అంశాలు, అభివృద్ధిని చూసి ఓటు వేయనున్నారని అంటున్నారు. అయితే ముఖ్య నేతలు మాత్రం ఈసారి గోద్రా గురించి మాట్లాడటం లేదు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications