వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానందపై కిడ్నాప్ కేసు, స్వామి సేవలో ఉన్న మహిళలు అరెస్టు, ప్లాట్ లో అమ్మాయిలు!

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్/బెంగళూరు: బెంగళూరు నగరం సమీపంలోని బిడిది దగ్గర ఆశ్రమం నిర్వహిస్తున్న స్వామి నిత్యానంద అలియాస్ నిత్యానంద మీద కిడ్నాప్, అక్రమంగా యువతులను నిర్బంధించారని ఆరోపిస్తూ కిడ్నాప్ కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, నిత్యానంద శిష్యులు, గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో ఆశ్రమం నిర్వహిస్తున్న సాద్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధి కిరణ్ అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన గుజరాత్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఫ్లాట్ లో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారని, వారిని రక్షించామని పోలీసులు అన్నారు. బెంగళూరు శివార్లలోని బిడిది నిత్యానంద ఆశ్రమంలో విచారణ చేసి వివరాలు సేకరించాలని గుజరాత్ పోలీసులు నిర్ణయించారు.

డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!

హైకోర్టును ఆశ్రయించిన దంపతులు

హైకోర్టును ఆశ్రయించిన దంపతులు

గుజరాత్ కు చెందిన జనార్దన్ శర్మా దంపతులు తమ కుమార్తెలను నిత్యానంద, ఆయన శిష్యులు నిర్బంధించారని, వాళ్లతో మాట్లాడటానికి, కలవడానికి మాకు అవకాశం ఇవ్వకుండా చేశారని ఆరోపిస్తూ గుజరాత్ హై కోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెలతో పాటు నిత్యానంద ఆశ్రమంలో అక్రమంగా బంధీలుగా ఉన్న అమ్మాయిలను రక్షించాలని జనార్దన్ శర్మా దంపతులు హైకోర్టులో మనవి చేశారు.

ఎదురు తిరిగిన అమ్మాయిలు

ఎదురు తిరిగిన అమ్మాయిలు

ఇటీవల జనార్దన్ శర్మా దంపతుల కుమార్తెలు ఉన్న ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. అక్కడ ప్లాట్ లో ఉన్న ఇద్దరు మైనర్ బాలికను పోలీసులు రక్షించారు. ఇదే సమయంలో జనార్దన్ శర్మా దంపతులతో వెళ్లడానికి వారి ఇద్దరు పెద్ద కుమార్తెలు నిరాకరించడంతో పోలీసులు చేతులు ఎత్తేశారు. మేము నిత్యానంద ఆశ్రమంలోనే ఉంటామని, మా తల్లిదండ్రులతో వెళ్లమని జనార్దన్ శర్మా కుమార్తెలు చెప్పారని పోలీసులు అన్నారు.

యోగిణి సర్వజ్ఞపీఠంలో అరెస్టు

యోగిణి సర్వజ్ఞపీఠంలో అరెస్టు

గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో నిత్యానందకు చెందిన యోగిణి సర్వజ్ఞపీఠం ఆశ్రమం ఉంది. యోగిణి సర్వజ్ఞపీఠం ఆశ్రమం నిర్వహణ భాద్యతలను సాద్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధి కిరణ్ అనే ఇద్దరు మహిళలు చూసుకుంటున్నారు. ఇదే ఆశ్రమంలో నిత్యానంద శిష్యులు అయిన సాద్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధి కిరణ్ అనే ఇద్దరు మహిళలను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు.

ప్లాట్ లో అమ్మాయిలు

ప్లాట్ లో అమ్మాయిలు

నిత్యానందకు చెందిన ప్లాట్ లోని నలుగురు అమ్మాయిలను గుజరాత్ పోలీసులు రక్షించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అమ్మాయిలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు అన్నారు. ప్లాట్ లో అమ్మాయిలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ నిత్యానంద శిష్యులైన సాద్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధి కిరణ్ అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

బెంగళూరుకు గుజరాత్ పోలీసులు

బెంగళూరుకు గుజరాత్ పోలీసులు

బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలోని నిత్యానంద ఆశ్రమంలో ఉంటున్న వారిని విచారణ చేసి వివరాలు సేకరించడానికి గుజరాత్ పోలీసులు సిద్దం అయ్యారని తెలిసింది. త్వరలోనే బిడిది ఆశ్రమంలో విచారణ చెయ్యడానికి గుజరాత్ పోలీసులు సిద్దం అయ్యారని సమాచారం. నిత్యానంద, ఆయన శిష్యుల మీద ఇప్పటికే అనేక ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడంతో కోర్టులో విచారణ జరుగుతోంది.

English summary
Gujrat police lodged FIR against self acclaimed godman Swamy Nityananda. Kidnap and wrongful confinement of children to make them collect donations complaints booked against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X