న్యూఢిల్లీలో బీభత్సమైన గాలిదుమారం, అంధకారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో బీభత్సమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒక్కసారిగా గాలి దుమారం చెలరేగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సాయంత్రం ఈదురుగాలులతో పాటు వర్షం పడటంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో అంధకారం నెలకొంది.
గత రెండు రోజులుగా రాజధాని ప్రజలు అధిక ఉష్ణోగ్రతతో అళ్లాడిపోతున్నారు. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలి దుమారం వచ్చింది. వేగంగా వీస్తున్న గాలులతో రాష్ట్రపతి కార్యాలయం, పరిసర ప్రాంతాలు దూళిమయమైపోయాయి.
ఎయిర్పోర్టులో రెడ్శాండిల్ పౌడర్ పట్టివేత
శంషాబాద్ ఎయిర్పోర్టులో 30 కేజీల రెడ్ శాండిల్ పౌడర్ను శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సూడాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.