వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ప్రణబ్‌ ప్రధాని అయ్యుంటే 2014 ఓటమి తప్పేది’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2004 సార్వత్రిక ఎన్నికల అనంతరం మన్మోహన్‌ సింగ్‌ బదులు ప్రణబ్‌ ముఖర్జీని ప్రధానిగా చేసి ఉంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓటమి తప్పేదని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి మన్మోహన్‌ను ఎంపిక చేయడం.. ఇంటా బయటా అనేకమందిని ఆశ్చర్యంలో ముంచెత్తిందని చెప్పారు.

‘ది అదర్‌సైడ్‌ ఆఫ్‌ మౌంటెయిన్‌' పేరుతో రచించిన నూతన పుస్తకంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్‌ యావద్దేశం నుంచి ప్రశంసలు పొందారని ఖుర్షీద్‌ చెప్పారు.

Had Pranab Become PM, Congress Might Have Averted 2014 Loss: Salman Khurshid

అంతటి వ్యక్తి కూడా 1999 ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలో ఎవరికీ పెద్దగా తెలియని అభ్యర్థి చేతిలో ఓడిపోయారని గుర్తు చేశారు. మన్మోహన్‌కు యూపీఏ సారథ్య బాధ్యతలు అప్పగించడంపై మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినా, రెండోసారి కూడా యూపీఏ అధికారంలోకి వచ్చాక అది సరైన నిర్ణయమేనని రుజువయిందని చెప్పారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ప్రజాదరణ పొందిన నేతలనీ, వారికి ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని అందించేవారెవరూ పార్టీలో లేరని పేర్కొన్నారు. కాగా, మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఉన్న సమయంలో విదేశీ వ్యవహారాల మంత్రికు తనకు పూర్తి స్వేచ్ఛ లభించిందని తెలిపారు.

English summary
Manmohan Singh's selection over Pranab Mukherjee in 2004 to head the UPA government came as a surprise not only to the Congress but also to outsiders and many argue the party might have averted the 2014 Lok Sabha drubbing if the choice had been otherwise, says former Union minister Salman Khurshid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X