పిఎమ్ మోదీకి ఏదో రకంగా శుభాకాంక్షలు తెలిపిన రాహుల్
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు కార్యక్రమాన్ని చేసిన అది విమర్శలకు తావిస్తోంది..అటు అధికార పార్టీలకు , ప్రతిపక్షపార్టీలకు కూడా ఇదే వర్తిస్తోంది.ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం రివాజు, ఈ సంధర్భంలో కోన్ని ప్రజలకు మంచి చేకూర్చేవిగా ఉంటాయి,మరి అలాంటీ సంధర్భంలో బద్ద వ్యతిరేక పార్టీలు ఒకరినోకరు గ్రీట్ చేసుకోవడం కొంచం కష్టమే , ప్రస్థుతం నేడు ఇదే పరిస్థితి , దేశ ప్రధానికి , ప్రతిపక్ష నేత రాహుల్ గాంధి మధ్య కొనసాగింది.
దేశ భద్రత లో భాగంగా అభివృద్ది చేసిన యాంటి శాటిలైట్ క్షిపణీ ని భారత్ ''మిషన్ శక్తి ''తో పేరుతో విజయవంతంగా ప్రయోగించింది. ఈ విషయాన్ని ప్రధాని మోడి ప్రకటించారు., దీంతో పలువురు మోడిని అభినందించారు.భారతదేశం ప్రపంచంలోని నాల్గవ స్పెస్ సూపర్ శక్తిగా మారిందని మోది తెలిపారు.దీంతో దేశవ్యాప్తంగా పలువురు, మోడిని అభినందిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నేతగా అభినందించకుంటే బాగుండదనుకున్నాడో ఏమో రాహుల్ గాంధి ,
ఈనేపథ్యంలోనే దీన్ని డీఆర్డీవో శాస్త్రవేత్తలు సాధించిన విజయంగా అభివర్ణించారు.వారికి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు,పనిలో పనిగా మోడికి కూడ అభినందనలు తెలపాలి కాబట్టి ఈరోజు వరల్డ్ థియెటర్ డే కావడంతో ,'' ప్రపంచ నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు'' తెలుపుతూ ట్వీట్ చేశారు.
సో మొత్తం మీద అటు శాస్త్రవేత్తలకు ఇటు మోడికి ఓకే పోస్టులో అభినందనలు ,మరియు శుభాకాంక్షలు తెలిపి తన రాజనీతిని ప్రదర్శించాడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధి