ఫేస్బుక్లో, ఫోన్లో అసభ్య మెసెజ్లు: మహిళ ఆత్మహత్య
ఆమెకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి అసభ్యకర సందేశాలు పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆమె సెల్ఫోన్కు అభ్యంతరకర సందేశాలు పంపించాడు. ఈ కారణంగా ఆదివారం ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
బంధువులు ఫిర్యాదు చేస్తే ఆధారాలు లేవని పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై వెంటనే పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
మరోవైపు ఎలాంటి ఆధారాలు లేని కారణంగా కేసు నమోదు చేయలేదని, అంతేకాకుండా ఇరు వర్గాలు చర్చించుకొని అండర్ స్టాండింగ్కు వచ్చాయని పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది. తమ నిర్లక్ష్యం ఏమీ లేదని పోలీసులు చెబుతున్నారట.
మృతి చెందిన మహిళ తన భర్త, రెండేళ్ల చిన్నారితో కలిసి ఉంటోంది. ఆదివారం రాత్రి ఆమె ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది తెలియడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.