గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా హర్థిక్ పటేల్, తక్షణమే అమల్లోకి నియామకం..
గుజరాత్లో బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. పాటిదార్ ఉద్యమ నేత హర్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అతనికి ప్రాధాన్యం పెంచుతున్నారు. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఇందుకు సంబంధించి అధినేత్రి ఆమోదం తెలిపారని.. హర్దిక్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
గుజరాత్ పీసీసీ చీఫ్గా ప్రస్తుతం అమిత్ చావ్డా ఉన్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉండగా.. హర్దిక్ పటేల్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతం అవుతోందని హై కమాండ్ భావిస్తోంది. పాటిదార్ కమ్యూనిటీలో హర్ధిక్ పటేల్కు మంచి క్రేజ్ ఉంది. మూడేళ్ల క్రితం నాటి అల్లర్ల కేసులో గతేడాది హర్థిక్ పటేల్ను అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
పటేల్లకు రిజర్వేషన్ కల్పించాలని హర్థిక్ పటేల్ ఉద్యమించారు. ఆయన ఉద్యమంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది. అతనిపై అక్రమ కేసులు బనాయించి.. అరెస్ట్ చేశారు. స్వస్థలం గుజరాత్ కూడా రానీయలేదు. తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలో చేరి.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీ చేపట్టే వరకు ఎదిగారు.