1000కోట్ల ప్యాకేజీకి వ్యతిరేకంగా 'లాలీపాప్' ఉద్యమం
గాంధీనగర్: ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేసేందుకు లాలీపాప్ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు పటీదార్ అనామత్ ఆందోళన సమితి(పీఏఏఎస్) నేత హార్దిక్ పటేల్ ప్రకటించారు. విద్యార్థులకు సర్కారు ప్రకటించిన ప్యాకేజీ పటేల్ వర్గానికి లాలీపాప్ వంటిదని ఆయన ఆరోపించారు.
ఈ ఆందోళనలో భాగంగా అన్ని గ్రామాలు, తాలూకాల్లో రహదారులపై పటేల్ వర్గీయులకు లాలీపాప్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, రాజ్కోట్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఉద్యమం ప్రారంభమైంది.
సెప్టెంబర్
29
వరకు
ఎలాంటి
ఉద్యమాన్ని
ప్రారంభించబోమని
గురువారం
హైకోర్టుకు
హామీ
ఇచ్చిన
హార్దిక్..
లాలీపాప్
ఉద్యమాన్ని
చేపట్టాలంటూ
తమ
వర్గ
సభ్యులకు
పిలుపునిచ్చారు.
ఆగస్టు
26న
తమ
వర్గీయుల
బలిదానానికి
నివాళిగా
శనివారం
ఇళ్లల్లో
కొవ్వొత్తులు
వెలిగిస్తామన్నారు.
'ముఖ్యమంత్రి యువ స్వావలంబన యోజన' పేరిట గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. దీనికింద కులాలతో సంబంధం లేకుండా కుటుంబ వార్షికాదాయం రూ.4.5 లక్షలకు మించని విద్యార్థులందరికీ రుసుముల మాఫీ జరుగుతుంది.