బీజేపీ నేతలకు ఏమైంది..? కాశ్మీరీ అమ్మాయిల వెంటపడ్డారు..! మొన్న ఎమ్మెల్యే.. నేడు ఏకంగా సీఎం!!
ఎన్నో ఉద్రిక్తతల నడుమ ఆర్టికల్ 370 రద్దు జరిగింది. దేశవ్యాప్తంగా జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకపక్క పరిస్థితులను మామూలు స్థితికి తీసుకురావడానికి కేంద్ర సర్కార్ నానా పాట్లు పడుతుంటే, బాధ్యతారహితంగా మాట్లాడిన ఓ సియం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త సమస్యలు సృష్టించేలా ఉన్నాయి.
పెట్టుబడులు సొంత డబ్బా కొట్టుకుంటే వస్తాయా జగన్ గారూ.. ఎద్దేవా చేసిన లోకేష్
కాశ్మీరీ అమ్మాయిలపై అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు
జమ్మూ
కాశ్మీర్
వ్యవహారం
అత్యంత
సున్నితమైన
వ్యవహారం.
ఇక
ఈ
విషయంలో
ఆచి
తూచి
వ్యవహరించాల్సిన
వారు,
జాగ్రత్తగా
మాట్లాడవలసిన
వారు
నోరు
జారి
మాట్లాడితే
దాని
పరిణామాలు
తీవ్రంగా
ఉండే
పరిస్థితి
ఉంది.
అలాంటి
చోట
హర్యానా
సీఎం
మనోహర్
లాల్
కట్టర్
అనాలోచితంగా
మాట్లాడారు.
కాశ్మీరి
అమ్మాయిలపై
ఆయన
చేసిన
వ్యాఖ్యలు
బిజెపికి
తలనొప్పిగా
మారాయి.
ఆర్టికల్
370
రద్దు
తరువాత
జమ్మూకాశ్మీర్
పునర్
విభజన
జరిగిన
తర్వాత
కశ్మీర్
లోయలో
ఇప్పుడిప్పుడే
ఆంక్షలు
సడలిస్తున్నారు.
ఇక
బాధ్యత
గలపదవిలో
కొనసాగుతున్న
వ్యక్తులు
తమ
స్థాయిని
మరిచి
అనాలోచిత
వ్యాఖ్యలు
చేస్తూ,
అత్యుత్సాహం
ప్రదర్శిస్తూ
విమర్శల
పాలవతున్నారు.
మొన్న యూపీ ఎమ్మెల్యే .. నేడు హర్యానా సీఎం .. అందమైన కాశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చని వ్యాఖ్యలు
మొన్నటికి
మొన్న
యూపీ
బిజెపి
ఎమ్మెల్యే
విక్రమ్
సైని
ఇక
అందమైన
కాశ్మీరి
అమ్మాయిని
పెళ్లి
చేసుకోవచ్చు
అని
,దేశంలోని
ముస్లిం
యువకులు
ఇక
నుంచి
అందంగా,
తెల్లగా
ఉన్న
కశ్మీరీ
అమ్మాయిలను
ఎలాంటి
భయం
లేకుండా
పెళ్లాడొచ్చనే
ఆనందంలో
ఉన్నారని
ముజఫ్ఫర్నగర్
ఎమ్మెల్యే
వ్యాఖ్యానించారు.
ఈ
వ్యాఖ్యలతో
రేపిన
దుమారం
మరువకముందే
మరోమారు
హర్యానా
ముఖ్యమంత్రి
కాశ్మీరి
అమ్మాయిలపై
వివాదాస్పద
వ్యాఖ్యలు
చేశారు.
జమ్ముకశ్మీర్కు
స్వయం
ప్రతిపత్తి
కల్పించే
ఆర్టికల్
370ని
కేంద్ర
ప్రభుత్వం
రద్దు
చేయడంపై
స్పందించిన
హర్యానా
ముఖ్యమంత్రి
మనోహర్లాల్
ఖట్టర్
మహర్షి
భగీరథ
జయంత్యుత్సవాల్లో
పాల్గొన్న
సందర్భంగా
చేసిన
వ్యాఖ్యలు
ఇప్పుడు
దుమారం
రేపుతున్నాయి.
కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్య
మాప్రభుత్వంలోని కొందరుమంత్రులు బిహార్ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారని పేర్కొన్న ఆయన మంత్రి ఓపీ ధన్ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చేప్పేవారు. కానీ ఇప్పుడు కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. అని సాక్షాత్తు సీఎం వ్యాఖ్యానించారు. అయితే ఖట్టర్ ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన విషయంలో హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా ఇకనుండి కాశ్మీరి అమ్మాయిలను కోడళ్ళుగా, భార్యలుగా చేసుకోవచ్చని అందరిచూపు కాశ్మీరి అమ్మాయిల వైపే ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో పెను దుమారం రేపి విమర్శలకు కారణమవుతున్నాయి.