వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని సమీపంలో మరోసారి కాల్పులు... కాంగ్రెస్ నేత మృతి...

|
Google Oneindia TeluguNews

దేశ రాజధానిలో మరోసారి కాల్పుల కలకలం రేగింది..ఢీల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో హర్యాణ రాష్ట్ట్ర కాంగ్రెస్ స్పోక్ పర్సన్ వికాస్ చౌదరీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.. ఉదయం జిమ్ చేసుకుని తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు కారుకు అడ్డు నిలబడి పది రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో గాయలపాలైన వికాస్ చౌదరీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు..అయితే అప్పటికే వికాస్ చౌదరీ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

కాగా జరిగిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది..రాష్ట్ర్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ,హింస చెలరేగుతుందని హర్యాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ తన్వార్ విమర్శించారు. ఇది జంగిల్ రాజ్ ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు.ఇలాంటీ సంఘటనలే రాష్ట్ర్రంలో పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాగా జరిగిన సంఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా కొద్ది కాలం క్రితం వరకు ఐఎన్ఎల్‌డీలో ఉన్న వికాస్ రాజ్ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Haryana Congress leader Vikas Chaudhary was shot dead

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో అందరు చూస్తుండగానే ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరుపుకుంటు వెళ్లారు.. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు ఒక్కసారిగా పరుగులు తీశారు..ఇలా దేశ రాజధాని ప్రాంతం హింసాయుత కార్యకలపాలకు అడ్డగా మారుతుండడంతో పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Haryana Congress leader Vikas Chaudhary was shot dead by unknown men in Faridabad near Delhi this morning. Mr Chaudhary, 38, was attacked while he was leaving a gym. He was rushed to a hospital where he died of his injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X