అద్భుతమే: కదులుతున్న రైలు కింద పడిన బాలుడు సురక్షితం, లోకోపైలట్లే ప్రాణదాతలు
న్యూఢిల్లీ: ఆ బాలుడి అదృష్టం బాగుంది. ఎందుకంటే, కదిలే రైలు కింద పడిన ఆ బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. రైలు డ్రైవర్ వెంటనే గమనించి రైలును ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆపడటంతో పెను ప్రమాదం తప్పింది. అనూహ్యంగా ఆ బాలుడు ప్రాణాలతో బయటపడటంతో ఆ రైలు డ్రైవర్, అతని సహాయకుడు ఎంతో ఆనందపడ్డారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
బాలుడ్ని గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసిన లోకో పైలట్..
వివరాల్లోకి వెళితే.. లోకో పైలట్ దివాన్ సింగ్, అతని సహాయకుడు అతుల్ ఆనంద్.. ఢిల్లీ-ఆగ్రా రైలు నడుస్తున్న సమయంలో రైలు కింద ఓ రెండేళ్ల బాలుడు పడినట్లు గుర్తించారు. వెంటనే వారు అత్యవసర బ్రేకులు వేశారు. ఆ తర్వాత దివాన్, అతుల్ రైలు నుంచి బయటకు దూకేశారు. రైలు కింద బాలుడు క్షేమంగా ఉండటంతో వీరు ఆనంద, ఆశ్చర్యాలకు గురయ్యారు.
బాలుడ్ని తల్లికి అప్పగించారు.. బహుమతి ప్రకటన
రెండు
పట్టాల
మధ్యలోనే
బాలుడు
ఉండటంతోనే
ఇది
సాధ్యమైనట్లు
గుర్తించారు.
వెంటనే
ఆ
బాలుడ్ని
బయటకు
తీసి,
అతని
తల్లికి
అప్పగించారు.
ఈ
ఘటన
ఫరీదాబాద్
ప్రాంతానికి
చెందిన
బల్లబ్ఘడ్
రైల్వే
స్టేషన్
వద్ద
చోటు
చేసుకుంది.
కాగా,
ఈ
గూడ్స్
రైలు
డ్రైవర్
జరిగిన
ఘటనకు
సంబంధించి
లిఖిత
పూర్వకంగా
పై
అధికారులకు
తెలియజేశారు.
దీంతో
ఆ
ఇద్దరు
రైలు
డ్రైవర్లకు
ఉన్నతాధికారులు
బహుమతి
ప్రకటించారు.
వారిని
అభినందించారు.
వీడియో వైరల్.. లోకో పైలట్లపై ప్రశంసలు
ఆ బాలుడు, అతని 14ఏళ్ల సోదరుడు పట్టాల సమీపంలో ఆడుకుంటుండగా.. అతడు రైలు కిందపడినట్లు తెలుస్తోంది. బాలుడు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో సదరు ఇద్దరు లోకో పైలట్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.