పీకమీద కత్తి పెట్టి విద్యార్థిని కిడ్నాప్, గ్యాంగ్ రేప్
చండీగఢ్: హర్యానాలో ఓ విద్యార్థినిని కారులో కిడ్నాప్ చేసి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ఆ అమ్మాయి తిరిగి ఇంటికి వెలుతున్న సమయంలో ఈ దారుణం జరిగింది.
పోలీసుల కథనం మేరకు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హర్యానాలోని కియోరా గ్రామంలో (17) ఓ యువతి నివాసం ఉంటున్నది. ఈమె 12వ తరగతి (ఇంటర్) చదువుతున్నది.
సోమవారం విద్యాసంస్థలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్లింది. తరువాత ఇంటికి వెలుతున్న సమయంలో బైక్ వచ్చిన ఇద్దరు నిందితులు ఆమెను అడ్డగించారు. కేకలు వేస్తే చంపేస్తామంటూ కత్తితో బెదిరించారు.
రెండు నిమిషాల తరువాత కారులో ముగ్గురు అక్కడికి వెళ్లారు. ఐదు మంది యువతిని కారులో కిడ్నాప్ చేశారు. తరువాత ఆమెను టిక్ అనే గ్రామంలోని ఓ ఇంటికి తీసుకు వెళ్లారు. మెడ మీద కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించి ఐదు మంది సామూహిక అత్యాచారం చేశారు.
విషయం బయటకు చెబితే చంపేస్తామని హెచ్చరించి వెళ్లారు. బాధితురాలు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసి కామాంధుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి (డీఎస్పీ) తరుణ్ కుమార్ తెలిపారు. గ్యాంగ్ రేప్ చేసిన వారిలో మోహన్, సౌరబ్ తో సహ మరో ముగ్గురు ఉన్నారని తరుణ్ కుమార్ చెప్పారు.