నిత్యానంద స్వామికి ఊరట, కానీ పురుషత్వ పరీక్షకు..
అయితే, నిత్యానంద స్వామి ఆగస్టు ఆరవ తేదీన పురుషత్వ పరీక్షలకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులు అందరు కూడా రామనగర కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
సినీ నటి రంజితతో నిత్యానందకు శారీరక సంబంధాలున్నాయన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు.
దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. దీంతో, నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
కాగా, వివాదాస్పద నిత్యానంద స్వామికి కోయంబత్తూరులోని కోవై కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ మూడవ తేదీన తమ ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. 2011 చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిత్యానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్ పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా చర్యలు తీసుకుంది.