కొలీగ్సే కాటేశారు: అదృశ్యమైన హెచ్డీఎఫ్సీ వైస్ ప్రెసిడెంట్ శవమై కనిపించాడు
కొన్ని రోజులు క్రితం అదృశ్యమైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సంఘ్వీ శవమై కనిపించారు. ముంబైలో గత ఐదురోజులుగా తను కనిపించకుండా పోయారు. కమలా మిల్స్ కాంపౌండ్లో ఉన్న తన కార్యాలయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఆయన కనిపించకుండా పోయారు. నవీ ముంబైలో ఓ కారును పోలీసులు కనుగొన్నారు. అందులో రక్తం మరకలతో ఉన్న కత్తి ఉంది.అదే సమయంలో తన ఫోన్ కూడా స్విఛ్ఛాఫ్ అవ్వడం జరిగింది.
ఏమయ్యారు?: హెచ్డీఎఫ్సీ వైస్ ప్రెసిడెంట్ అదృశ్యం
ఇదిలా ఉంటే శనివారం ముంబైలో 20 ఏళ్ల సర్ఫరాజ్ షేక్ అనే క్యాబ్ డ్రైవర్ను అనుమానంతో పోలీసులు అరెస్టు చేశారు. చిన్న వయసులోనే తాను వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ అయినందున సిద్ధార్థ్ సింఘ్వీపై కొందరు తన సహోద్యోగులు ఓర్వలేకే ఆయన్ను చంపాల్సిందిగా కిరాయి ఇచ్చారని క్యాబ్ డ్రైవర్ తెలిపాడు. ఇందులో మొత్తం నలుగురు ఉన్నారని కుట్రలో ఒక మహిళకు కూడా భాగం ఉందని క్యాబ్ డ్రైవర్ షేక్ తెలిపాడు. క్యాబ్ డ్రైవర్ షేక్ సిద్ధార్థ్ సింఘ్వీని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో పడేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే సింఘ్వీ తన భార్య ఎనిమిదేళ్ల కొడుకుతో కలిసి దక్షిణ ముంబై ప్రాంతంలోని మలబార్ హిల్లో నివాసముంటున్నాడు. అయితే ముంబై పోలీస్ కంట్రోల్ రూంలోని సీసీ కెమెరాలు, థానే, నవీ ముంబైలోని సీసీకెమెరాల కంటికి సింఘ్వీ కారు దృశ్యాలు చిక్కలేదన్నారు పోలీసులు. మరేదైనా ఇతర రూట్లలో షేక్ కారు నడిపారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఆరు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.