చిదంబరం నిజాలు మాట్లాడుతున్నారనే.. అవమానకరంగా వేటాడుతున్నారు: ప్రియాంకాగాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఏ క్షణాన్నయినా అరెస్టు చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ ను ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించిన నేపథ్యంలో.. చిదంబరం అరెస్టు తప్పనిసరిగా మారింది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా చిదంబరానికి బాసటగా నిలిచారు. నిజాలు మాట్లాడుతున్న తమ నాయకుడి గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్ చేశారు.
An extremely qualified and respected member of the Rajya Sabha, @PChidambaram_IN ji has served our nation with loyalty for decades including as Finance Minister & Home Minister. He unhesitatingly speaks truth to power and exposes the failures of this government,
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 21, 2019
1/2
దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్, రాజ్యసభ సభ్యుడైన చిదంబరం దశాబ్దాల కాలం పాటు సేవలు అందించారని, అలాంటి నాయకుడిని అత్యంత అవమానకరంగా వేటాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు చేస్తోన్న తప్పులను రాజ్యసభలో ఎత్తి చూపుతుండటం, నిజాన్ని ప్రజల ముందు ఉంచుతున్నందు వల్లే ఆయనను జైలుపాలు చేయడానికి కుయుక్తులు పన్నారని అన్నారు.
but the truth is inconvenient to cowards so he is being shamefully hunted down. We stand by him and will continue to fight for the truth no matter what the consequences are.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 21, 2019
2/2
ఆయన చెప్పే నిజాలను జీర్ణించుకోలేక అవమానకరంగా వేటాడుతున్నారని ధ్వజమెత్తారు, ఆరోపించారు. తమ పార్టీ నాయకుడికి ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటాడని, నిజాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని అన్నారు.