ఆరుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులు: హెచ్ఎం అరెస్ట్
శివగంగ: ఆరుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని పెరియణరికొట్టాయిలో చోటు చేసుకుంది.
విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పంచాయత్ యూనియన్ ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురుగన్ను అదుపులోకి తీసుకున్నారు.
16 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో టీచర్ ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిపై చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పూసాయిదురాయి, అడిషనల్ సూపరింటెండెంట్ వందిత పాండే విచారణ జరిపారు.
పూసాయిదురాయి మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులు తమ విద్యను అదే పాఠశాలలో కొనసాగించవచ్చని.. నిందిత ప్రధానోపాధ్యాయుడ్ని తొలగించి మరో టీచర్ను నియమిస్తామని హామీ ఇచ్చారు.