ద రియల్ లీడర్... మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఎల్కే అద్వాని
75 సంవత్పరాల కురువృద్దుడు..బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు అయినా అయనకు టీకెట్ మాత్రం దక్కలేదు..ప్రణాళికబద్దంగా అద్వానిని మోడీ పక్కను బెట్టిన ఆయన మాత్రం తన పెద్దరికార్ని నిలుపుకున్నాడు. తనకు రాజకీయాలు అవసరం లేకున్న నరేంద్రమోడీ సాధించిన విజయంపై అభివందనలు తెలిపారు. మోడీ గెలుపును అపూర్వ విజయంగా ఆయన అభివర్ణించారు. ఇరవై సంవత్సరాల తర్వాత అంతపెద్ద మెజారీటీ రావడంపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.
కాగా వయసురిత్యా ఎల్కే అద్వానితోపాటు ,మురళిమనోమర్ జోషికి సీట్లను కేటాయించలేదు. దీంతో ఆయన రాజకీయ జీవితంలో మొదటిసారిగా అభ్యర్థిగా కాకుండా ఒక ఓటరుగా నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కాగా గాంధీనగర్ నుండి అద్వానికి బదులుగా బీజేపీ పార్టీ చీఫ్ అమిత్ షా రంగలంలోకి దిగి విజయం సాధించాడు. కాగా ఎల్కే అద్వాని ఆరు ఎంపీగా గెలుపోందాడు. బీజేపీని పలు రథయాత్రలతో అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున కృషి చేసిన విషయం తెలిసిందే..అయినా సీటు కేటాయింపులో మోడీపై ఒక్క విమర్శ చేయని నాయకుడు అద్వాని..మొత్తం పార్టీ సిద్దాంతానికి కట్టుబడిన వ్యక్తి ఎల్కే అద్వాని