వయానాడ్ కకావికలం: మట్టిలో కూరుకుపోయిన నివాసాలు: ప్రధానికి రాహుల్ గాంధీ ఫోన్!
Recommended Video
తిరువనంతపురం: రెండురోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు కేరళలోని వయానాడ్ జిల్లా కకావికలమౌతోంది.70 శాతం మేర తేయాకు తోటలు, కొండలతో నిండివున్న ఈ జిల్లాలో 48 గంటలుగ ఎడతెరినివ్వకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాల్లో కొండ చరియలు, మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. జిల్లాలోని మెప్పాడి సమీపంలో పుతుమల తేయాకు తోటల వద్ద తాజాగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల నివాసాలు బురదలో కూరుకుపోయాయి. సుమారు 150 మంది వరకు ఈ బురదలో కూరుకుని పోయి ఉంటారని అనుమానిస్తున్నారు.
𝐖𝐚𝐲𝐚𝐧𝐚𝐝 𝐌𝐞𝐩𝐩𝐚𝐝𝐢 𝐋𝐚𝐧𝐝𝐬𝐥𝐢𝐝𝐞 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : #TEAMNDRFINDIA on Ground 0-Rescue ops on w/State agencies. Rptd 100 persons evacuated safely-missing search on. NDRF will do its best possible🙏🏻@KeralaSDMA @NDRFHQ @PMOIndia @HMOIndia @PIBHomeAffairs @DDNewsLive
— ѕαtчα n prαdhαn, dírєctσr gєnєrαl,ndrf (@satyaprad1) August 9, 2019
సముద్రుడి ఉగ్రరూపానికి బలి: కళింగపట్నంలో చొచ్చుకొచ్చిన అలలు!
సమాచారం అందిన వెంటనే జిల్లా పాలన, పోలీసు యంత్రాంగం జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను రంగంలోకి దించింది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు హెలికాప్టర్ల ద్వారా 100 మందిని కాపాడారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వయానాడ్ లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ప్రధాని రాహుల్ గాంధీకి ఫోన్ చేశారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో నెలకొన్న దుస్థితిని ఆయనకు వివరించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.
The people of Wayanad, my Lok Sabha constituency, are in my thoughts & prayers as they battle raging flood waters.
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2019
I was to travel to Wayanad, but I’ve now been advised by officials that my presence will disrupt relief operations. I’m awaiting their OK to travel.
వయానాడ్ జిల్లాలో మారుమూల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. చాలాచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆఱ్ ఎఫ్ బలగాలు హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నారు. ఈ ఒక్క జిల్లాలోనే 22 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరదల బారిన పడి 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించారు. జిల్లా వ్యాప్తంగా 315 సహాయ, పునరావాస శిబిరాలను నెలకొల్పారు. వయానడ్ తో పాటు ఇడుక్కి, మళప్పురం, కోజికోడ్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కన్నూర్, ఇరిట్టి, కల్పెట్ట, థమరస్సెరిలల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
Earlier today I spoke to the Kerala CM, Shri P Vijayan, drawing his attention to the serious flood situation in Wayanad. I’ve also spoken to the Collectors of Wayanad, Kozhikode & Malappuram to review relief measures being undertaken
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2019
ఈ సమాచారం అందిన వెంటనే రాహుల్ గాంధీ వయనాడ్ కు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నానికి ఆయన వయానాడ్ చేరుకుంటారు. తన లోక్ సభ నియోజకవర్గం పరిధిలో నెలకొన్న భయానక దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఈ ఉదయం ప్రధానికి ఫోన్ చేశారు.
I request Congress workers & leaders, citizens & NGOs working in Kerala to help with relief operations in flood hit areas of Wayanad.
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2019
I hope the State Govt will release a generous financial rehabilitation package to help those who’ve been impacted by the floods.
తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. వయానాడ్ తో పాటు కేరళలోని 12 జిల్లాలు వరదపోటుకు గురైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వరద సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. సహాయ, పునరావాస చర్యలను మరింత వేగవంతం చేయాలని, భారీ సంఖ్యలో ఎన్డీఆర్ఎఫ్ బలగాను మోహరింపజేయాలని కోరారు. నిర్వాసితులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలిని రాహుల్ గాంధీ కేరళ ప్రభుత్వాన్ని కోరారు.