పంచశీల ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం: చైనా
బ్రిక్స్ సదస్సును పురస్కరించుకొని చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. డోక్లామ్ ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాల అధినేతలు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
బీజింగ్: బ్రిక్స్ సదస్సును పురస్కరించుకొని చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. డోక్లామ్ ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాల అధినేతలు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
రెండు దేశాల్లో నెలకొన్న అంశాలపై వివిధ అంశాలపై చర్చించారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు జిన్ పింగ్ ను మోదీ అభినందించారు.
భారత్-చైనాలు పరస్పరం అగ్ర పొరుగుదేశాలని, ప్రపంచ శక్తులుగా ఆవిర్భవిస్తున్న అతిపెద్ద దేశాలని జిన్ పింగ్ తెలిపారు.
తమ రెండు దేశాల నడుమ ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 73 రోజుల డోక్లాం ప్రతిష్ఠంభన నేపథ్యంలో 1954లో భారత్-చైనా కుదుర్చుకున్న పంచశీల ఒప్పందం అమలులో భారత్ తో కలిసి పనిచేసేందుకు, భారత్ మార్గదర్శకత్వాన్ని కోరేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. వీరి భేటీపై ఆసక్తి రేగుతోంది.