ఆర్టిస్ట్ హేమ హత్యలో షాకింగ్: భర్త ఏం చెప్పాడు?
ముంబై: ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది హత్య కేసులో హేమా భర్త చింతన్ ఉపాధ్యాయను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విచారించారు. ఈ విచారణలో చింతన్ షాకింగ్ విషయాలు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
హేమా హత్యతో తనకు సంబంధం లేదని చింతన్ ఉపాధ్యాయ తొలుత చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మంగళవారం అతనిని అరెస్టు చేశారు. విచారణలో అతను తన భార్యను చంపేందుకు ఎలా కుట్ర చేసింది వివరించాడు.
చింతన్ ఉపాధ్యాయ ఏం చెప్పాడు?
-
ఓసారి
చింతన్
అభ్యంతరకర
పెయింటింగ్
వేశాడు.
అది
ఆయన
భార్య
హేమకు
ఏమాత్రం
నచ్చలేదు.
-
తన
పట్ల
ఆమె
వ్యవహారశైలి
నచ్చలేదు.
-
పోలీసులు
తెలిపిన
వివరాల
ప్రకారం...
తనను
కోర్టుకు
లాగిన
నేపథ్యంలో,
న్యాయస్థానాలకు
తిరగలేక
అతను
హేమను
చంపాలని
నిర్ణయించుకున్నాడు.
-
హేమ
-
చింతన్
భార్యాభర్తలు.
ఆ
తర్వాత
వీరి
విడాకుల
విషయం
కోర్టు
దాకా
వెళ్లింది.
-
2013లోనే
తొలిసారి
తన
భర్త
చింతన్
పైన
హేమ
కేసు
పెట్టారు.
తాము
వివాహం
చేసుకున్న
ఇంటిలోని
గోడల
పైన
అసభ్యకర
మహిళల
ఫోటోలు
గీస్తున్నారని
పేర్కొన్నారు.
అలాగే
తనను
వేధిస్తున్నాడని
చెప్పారు.
-
తాము
బరోడాలో
కోర్స్
చేస్తుండగా
ప్రేమలో
పడినట్లు
పోలీసుల
విచారణలో
చింతన్
చెప్పారు.
1999లో
పెళ్లైనట్లు
చెప్పారు.
-
2013లో
విడాకుల
ఫైనల్
సెటిల్మెంట్
కోసం
రూ.5
కోట్లు
డిమాండ్
చేసినట్లు
చింతన్
చెప్పాడు.
లేదంటే
నెలకు
రూ.5
లక్షలు
ఇవ్వాలని
షరతు
పెట్టినట్లు
చెప్పాడు.
-
తాను
హేమను
మాత్రమే
చంపేందుకు
ఒప్పందం
కుదుర్చుకున్నానని,
కానీ
వారు
లాయర్ను
కూడా
చంపేశారని
చెప్పాడని
తెలుస్తోంది.
-
చింతన్..
విద్యాధర్
రాజ్భర్తో
కలిసి
హేమను
చంపేందుకు
కుట్ర
చేశాడు.
-
విద్యాధర్...
హేమను
చంపేందుకు
రూ.30
లక్షలు
అడిగాడు.
చివరకు
రూ.10
లక్షల
వద్ద
ఒప్పందం
కుదిరింది.
-
సమాచారం
మేరకు...
హేమను,
ఆమె
లాయర్ను
విద్యాధర్
రాజ్భర్
వేర్
హౌస్కు
రప్పించేందుకు
చింతన్
ప్లాన్
చేశాడు.
ఆమెకు
ఫోన్
చేయడం
ద్వారా
రప్పించాలని
ప్లాన్
చేశారు.