వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హై టెన్సన్ వైర్లు తెగి ముగ్గురి దుర్మరణం

|
Google Oneindia TeluguNews

బీహార్: బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లా ముజిలియా ప్రాంతంలో హై టెన్సన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ షాక్ తో ముగ్గురు దుర్మరణం చెందారు. విషయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. హై టెన్సన్ విద్యుత్ తీగలు ఒక్క సారిగా తెగి ముగ్గురి మీద పడ్డాయని, వారు సంఘటనా స్థలంలోనే మరణించారని పోలీసులు చెప్పారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

High tension wire electrocutes three people in Bihar

న్యాయం చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. గత 10 రోజుల్లో బీహార్ లో ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. గత వారం ఇంటిలో నిద్రిస్తున్న వారి మీద విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబంలోని ఆరు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

English summary
At least three people were electrocuted after a high tension wire fell on them in Majhaulia area of Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X