హై టెన్సన్ వైర్లు తెగి ముగ్గురి దుర్మరణం
బీహార్: బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లా ముజిలియా ప్రాంతంలో హై టెన్సన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ షాక్ తో ముగ్గురు దుర్మరణం చెందారు. విషయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. హై టెన్సన్ విద్యుత్ తీగలు ఒక్క సారిగా తెగి ముగ్గురి మీద పడ్డాయని, వారు సంఘటనా స్థలంలోనే మరణించారని పోలీసులు చెప్పారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
న్యాయం చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. గత 10 రోజుల్లో బీహార్ లో ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. గత వారం ఇంటిలో నిద్రిస్తున్న వారి మీద విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబంలోని ఆరు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.