ప్రేమలు, అక్రమసంబంధాలే హత్యలకు ప్రధాన కారణం ...!! నేషనల్ క్రైం రికార్డ్స్
మనుష్యులను హత్యలు చేయడానికి, వారిని తనమన తేడా లేకుండా దారుణంగా కడతేర్చడానికి వివిధ కారణాలు ఉంటాయి. అయితే ఈ కారాణల్లో కక్షలు, శత్రుత్వాలు ఉంటాయి. అయితే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ వ్యవహరించిన నివేదికలో ప్రమించడం, అక్రమ సంబంధాలు లాంటీ వ్యవహరాల్లోనే ఎక్కువ శాతం హత్యలు జరిగాయని తన నివేదికలో పేర్కోంది.
ఈనేపథ్యంలోనే ప్రేమవ్యవహారాల వల్లే భారత్లో అత్యధిక హత్యలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల్లో వెల్లడించింది. ఎన్సీఆర్బీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2001-2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలేనని తేల్చింది.
ప్రేమ హత్యలు జరిగిన మొదటి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధికంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవేనని నివేదికల్లో పేర్కోన్నాయి. . ఇక రెండవ స్థానంలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రేమవ్యవహారానికి సంబంధించిన హత్యలు జరిగినట్టు తెలిపింది. ప్రేమ వ్యవహారాల్లో వివాహేతర సంబంధాల వల్ల జరిగిన హత్యలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2001లో దేశావ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదు అయ్యాయని... అవి 2017 సంవత్సరానికి వచ్చే సరికి 21 శాతం తగ్గి 28,653 కేసులు నమోదు అయినట్టు తెలిపింది. మరోవైపు వ్యక్తిగత కక్ష్యతో చేసే హత్యలు కూడ 2001 సంవత్సరంతో పోల్చితే... 4.3 శాతం తగ్గాయని నివేదికలో పేర్కోంది.. ఇక ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యల సంఖ్య కూడా 12 శాతం తగ్గినట్టు చెప్పింది. అయితే ప్రేమ వ్యవహారాలు మరియు వివాహేతర సంబంధాల వల్లే 28శాతం హత్యలు జరుగుతున్నాయని వెల్లడైంది. వందలోపు పరువు హత్యలు కూడ నమోదు అయినట్టు చెప్పింది.