అక్కడ ఐసిస్...ఇక్కడ ఆర్ఎస్ఎస్... సేం టూ సేం... తమిళనాడు కాంగ్రెస్
కమల హాసన్ హిందు ఉగ్రవాదంపై మాట్లాడిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడంతో ఆయనపై తమిళనాడు బీజేపీ విరుచుకుపడింది..కమల హసన్ గాంధి వారసుడు కాదని ఆయన జిన్నా వారసుడని మండిపడ్డారు. కాగా వేలాదీమందిని ఆగస్టు 15 1947 తర్వాత వేలాదీ మంది శవాలను రైళ్లలో వేసి పంపిణ జిన్నా గుర్తుకు రావడం లేదా అంటూ ఆయనపై మండిపడ్డారు. అయితే కమలహాసన్కు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ నుండి మద్దతు లభించింది.
కమల హసన్ చేసిన వ్యాఖ్యలు వెయ్యి శాతం సరైనవే అంటూ తమిళనాడు కాంగ్రేస్ పార్టీ చీఫ్ ఆళగిరి మద్దతు పలికారు. దీంతోపాటు బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఆయన ఐసిస్ తో పోల్చాడు.ఇస్లాం పేరు చెప్పుకుని ఐసిస్ ఎలాగైతే తీవ్రవాద సంస్థగా మారిందో హిందుయిజం పేరు చెప్పుకుని ఆర్ఎస్ఎస్ కూడ తీవ్రవాద సంస్థగా మారిందని ఆయన విమర్శించారు. కాగా హిందు సంస్థలు తమని వ్యతిరేకించేవారిని అంతమొందించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను ఆయన 100 శాతం కాదు, 1000 శాతం కరెక్టే అని సమర్ధించారు.
అంతకుముందు కమలహాసన్ అరవకుచ్చి నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య భారత చరిత్ర మొదటి తీవ్రవాది ఒక హిందువు అంటూ ,గాంధిని చంపిన నాధూరాం గాడ్సెను ప్రస్థావిస్తూ విమర్శలు చేశారు. గాంధికి అందుకే న్యాయం కావాలని అని అడుగుతున్నాని అయన అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి.