జేమ్స్ బాండ్కు భారతీయ కంపెనీ చుక్కలు!
ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ లకు.....విలన్లకు చుక్కలు చూపించే హాలివుడు నటుడు జేమ్స్ బాండ్ పాత్రను ధరించిన పియర్స్ బ్రస్నన్ కు ఓ ఇండియన్ కంపెనీ చుక్కలు చూపించింది.విలన్లు...అండర్ వరల్డ్ డాన్లకు సినిమాల్లో చుక్కుల చూపించిన జేమ్స్ బాండ్ హీరోకి ఇండియాకు చెందిన పాన్ మసాలా కంపెనీ చుక్కలు చూపించింది.
90 వ, దశకంలో జేమ్స్ బాండ్ పాత్రను ధరించి పేరొందిన హాలీవుడు నటుడు పియర్స్ బ్రాస్నన్ ఫోటో తో ఇండియాకు చెందిన పాన్ బహార్ అనే పాన్ మసాలా కంపెనీ తన ఉత్పత్తులను ప్రచారం చేసుకొంటుంది. పాన్ మసాల ఉత్పత్తుల ప్రచారానికి తన ఫోటోను వాడుకోవడం పట్ల ప్రియర్స్ బ్రాస్నన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ప్రజలకు ఉపయోగపడే వస్తువులకు తాను ప్రచారం చేస్తానని....ప్రజలకు తీవ్రంగా నష్టం కల్గించే ఉత్పత్తుల ప్రచారాన్ని తాను వ్యతిరేకిస్తానని పియర్స్ చెప్పారు.పొగాకు వల్ల ఏ రకమైన ప్రమాదాలున్నాయో తనకు బాగా తెలుసునని చెప్పారు.పొగాకుతో క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని ఆయన గుర్తు చేశారు.ఈ భయంకరమైన వ్యాధితోనే తన మొదటి భార్యను, కూతురును కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.
బ్రీత్ ప్రెష్నర్, పళ్ళకు సంబందించి ప్రచారం కోసం ప్రకటనలు చేశానని...పొగాకు లాంటి వ్యాధికారక ఉత్తత్తుల ప్రచారం కోసం తానెప్పుడూ ప్రచారం చేయలేదన్నారు. ఇండియా కంపెనీ పొగాకు ఉత్పత్తుల ప్రచారం కోసం వాడుతున్న తన ఫోటోను వెంటనే తీసివేయాల్సిందిగా కోరతానని చెప్పారు. లేకపోతే అక్రమంగా తన పోటోను వాడుకొన్నందుకుగాను న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు.