వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిలో 9 మందిని బలి తీసుకున్న మద్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

బారాబంకి (ఉత్తరప్రదేశ్): ఇంట్లో తయారు చేసిన మద్యం సేవించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో 9 మంది మరణించారు. మృతులు వివిధ గ్రామాలకు చెందినవారు

మంగళవారం రాత్రి వారంతా ఓ విందుకు హాజరయ్యారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత అస్వస్థతకు గురై మరణించారు. వారు సేవించింది కల్తీ మద్యమై ఉంటుందా, లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

Home-Made Liquor Allegedly Kills 9 In Uttar Pradesh's Barabanki

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వివరాలు ఇస్తామని జిల్లా యంత్రాంగం అంటోంది. కల్తీ మద్యం లేదా అక్రమ మద్యం సరఫరా చేసేవారికి మరణ శిక్ష విధించే చట్టాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. శాసనసభ ఆమోదించిన ఆ బిల్లుకు ఈ నెలలో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.

కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవిస్తే అందుకు కారణమైనవారికి మరణశిక్షను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మూడోది. ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఆ చట్టం ఉంది.

English summary
At least nine people have died allegedly after consuming home-made liquor in Uttar Pradesh's Barabanki district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X