వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి - ఆస్పత్రి నుంచే వీడియో కాన్ఫరెన్స్ - కరోనాపై కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుని, మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తిగా కోలుకున్నారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం నుంచి షా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి.

హైదరాబాద్: అతి భారీ హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలన్న లోకేశ్ - మూసీ ఒడ్డున మొసళ్ల కలకలం హైదరాబాద్: అతి భారీ హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలన్న లోకేశ్ - మూసీ ఒడ్డున మొసళ్ల కలకలం

ఆగస్టు 2న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అమిత్ షా.. గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. మూడు వారాల చికిత్స అనంతరం నెగటివ్ గా తేలడంతో గతవారమే ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఆదివారం రాత్రి తిరిగి సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్లు ఆయనను డిశ్చార్జ్ చేశారు. కాగా,

Home minister Amit Shah discharged from AIIMS, attends virtual meet in his constituency

ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందు అమిత్ షా.. ఆస్పత్రి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా గాంధీనగర్ లో నిర్మించిన నీటి పథకాలను ఆయన ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడే గాంధీ నగర్ లో నీటి ప్రాజెక్టులు ప్రారంభం అవుతుండటం సంతోషకరమని అమిత్ షా అన్నారు. అలాగే..

చైనాతో టెన్షన్: తెరపైకి కొత్త అంశం -పెట్రోలింగ్‌పై ఆంటోనీ ప్రశ్నలు - వివరాలు చెప్పలేనన్న రక్షణమంత్రిచైనాతో టెన్షన్: తెరపైకి కొత్త అంశం -పెట్రోలింగ్‌పై ఆంటోనీ ప్రశ్నలు - వివరాలు చెప్పలేనన్న రక్షణమంత్రి

Home minister Amit Shah discharged from AIIMS, attends virtual meet in his constituency

దేశంలో కరోనా పరిస్థితిపైనా కేంద్ర హోం మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరాటం అత్యంత కఠినమైందని, అయితే, క్రమక్రమంగా పరిస్థితి మెరుగుపడుతూ వస్తున్నదని, వైరస్ ముప్పు తొలిగిపోయేదాకా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని అమిత్ షా అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 97,894 పాజిటివ్‌ కేసులు, 1,132 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,18,254కు, మరణాల సంఖ్య 83,198కు పెరిగింది.

English summary
Four days after he was re-admitted to All India Institute of Medical Sciences (AIMS) for a medical check up for his Covid ailment, Home minister Amit Shah was discharged from hospital on Thursday. Before the discharge, Shah addressed an event through video conferencing. The Home Minister attended the inauguration of a water work scheme under smart city programme for his Gandhinagar constituency in Gujarat through video conferencing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X