ఐపిఎస్ల పాసింగ్ ఔట్: సంతోషమని రాజ్నాథ్(పిక్చర్స్)
హైదరాబాద్:శిక్షణ పూర్తి చేసుకున్న ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపిఎస్)లు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్కు రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని.. అందుకే పటేల్ జన్మదినాన్ని ఏక్ దివాస్గా ప్రధాని ప్రకటించారని తెలిపారు. పటేల్ జన్మదినం రోజున ఐపిఎస్లు శిక్షణ పూర్తి చేసుకోవడం సంతోషకరమని అన్నారు.
ఐపిఎస్లు పరస్పరం సహకరించుకుని సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అన్నారు. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టాలని రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాగా, అకాడమీ 66వ బ్యాచులో మొత్తం 128మంది ఐపిఎస్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. అందులో 19మంది మహిళా ఐపిఎస్లు ఉన్నారు. 15మంది విదేశాలకు చెందిన పోలీసు అధికారులు కూడా ఉన్నారు.
పాసింగ్ ఔట్
శిక్షణ పూర్తి చేసుకున్న ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపిఎస్)లు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
పాసింగ్ ఔట్
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్కు రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పాసింగ్ ఔట్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని.. అందుకే పటేల్ జన్మదినాన్ని ఏక్ దివాస్గా ప్రధాని ప్రకటించారని తెలిపారు.
పాసింగ్ ఔట్
పటేల్ జన్మదినం రోజున ఐపిఎస్లు శిక్షణ పూర్తి చేసుకోవడం సంతోషకరమని అన్నారు.
పాసింగ్ ఔట్
ఐపిఎస్లు పరస్పరం సహకరించుకుని సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అన్నారు.
పాసింగ్ ఔట్
దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టాలని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
పాసింగ్ ఔట్
అకాడమీ 66వ బ్యాచులో మొత్తం 128మంది ఐపిఎస్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
పాసింగ్ ఔట్
అందులో 19మంది మహిళా ఐపిఎస్లు ఉన్నారు. 15మంది విదేశాలకు చెందిన పోలీసు అధికారులు కూడా ఉన్నారు.
పాసింగ్ ఔట్
దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని.. అందుకే పటేల్ జన్మదినాన్ని ఏక్ దివాస్గా ప్రధాని ప్రకటించారని తెలిపారు.
పాసింగ్ ఔట్
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్కు రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.