Home Stay: మైసూరు ఆంటీలు, మండ్య బజ్జీలు, రేట్లు డేట్లు ఫిక్స్, లాక్ డౌన్ నష్టాలు, హైటెక్ స్కెచ్ !
బెంగళూరు/ మంగళూరు/ కొడుగు: కరోనా వైరస్ కష్టాలను ఎదుర్కొవడానికి, లాక్ డౌన్ నష్టాలను పూడ్చుకోవడానికి కొందరు అడ్డదార్లు తొక్కుతున్నారని మరోసారి వెలుగు చూసింది. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన వారిని వలలో వేసుకుని హోమ్ స్టేల్లో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారు. అమ్మాయిలకు ఒకరేటు, ఆంటీలకు ఒకరేటు అంటూ రేట్లు డేట్లు ఫిక్స్ చేసి వారి ఫోటోలు సోషల్ మీడియాలో పంపించి విటులను ఆకర్షిస్తున్నారు. హోమ్ స్టేలో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చల్లటివాతావరణంలో వెచ్చగా ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిన శృంగార పురుషులు షర్టులు, ప్యాంట్ లు వదిలేసి పరుగు తీశారు.
Illegal affair: ఆంటీ నర్సు, 108 డ్రైవర్, మంచమేసి దుప్పటేసి మల్లెపూలు, అంబులెన్స్ ఏసీ ఆన్!
ఫేమస్ పర్యాటక కేంద్రం
కర్ణాటకలోని కొడుగు జిల్లాకు ప్రత్యేక పర్యాటక కేంద్రంగా మంచి గుర్తింపు ఉంది. కొడుగు జిల్లాలోని మడికేరి, కుశాలనగర తదితర ప్రాంతాల్లో విలాసవంతమైన రిసార్టులు, హోమ్ స్టేలు, మంచిమంచి విలాసవంతమైన హోటల్స్ ఉన్నాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో కొన్ని నెలలుగా మూతపడిన రిసార్టులు, హోమ్ స్టేలు ఇటీవల మళ్లీ తెరుచుకోవడంతో వాటి యాజమాన్యం మళ్లీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
హోమ్ స్టేకి రండి.... ఎంజాయ్ చెయ్యండి
కుశాలనగరలోని గంధద కోఠిలోని ఓ హోమ్ స్టేలో బస చెయ్యడానికి ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది పోలో అంటూ వచ్చేస్తున్నారు. కుశాలనగరలోనే ఉన్న మరికొన్ని హోమ్ స్టేలు ప్రస్తుతం కస్టమర్లు లేక ఈగలు తోలుకుంటున్నా గంధద కోఠిలోని ఆ హోమ్ స్టేకి మాత్రం ప్రతిరోజు కొత్తకొత్త వ్యక్తులు వచ్చి వెలుతున్నారు. ఈ హోమ్ స్టేలో ఏమి అంత ప్రత్యేకతలు ఉన్నాయప్పా ? అంటూ సాటి హోమ్ స్టే నిర్వహకులకు అనుమానం వచ్చింది.
మైసూరు బజ్జీల టైపులో మైసూరు ఆంటీలు
మైసూరు బజ్జీల టైపులో మైసూరు ఆంటీలను, మండ్య ముద్దుగుమ్మలను రంగంలోకి దింపి హోమ్ స్టేల్లో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని, ఆ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మహిళలను పిలుచుకుని వస్తున్నారని కొందరు గుర్తించారు. వారి దేవుడో ఏమి స్కెచ్ వేశారురా ? అంటూ కొందరు స్థానిక సీఐ మహేష్ కు సమాచారం ఇచ్చారు. పోలీసులు హోమ్ స్టేలోకి ఎంట్రీ ఇవ్వడంతో అసలు బండారం బయటపడింది.
కలర్, కండలు బాగుండే అమ్మాయిలు
హోమ్ స్టేలో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. హోమ్ స్టే హైటెక్ వ్యభిచారం ముఠాకు చెందిన మాదలాపురం నివాసి రజనీకాంత్, కుశాలనగర నివాసి రాజేష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రజనీకాంత్, రాజేష్ లు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటూ డబ్బు కోసం ఆశపడుతున్న అమ్మాయిలు, ఆంటీలకు వల వేసి వారికి మాయమాటు చెప్పి కుశాలనగరలోని హోమ్ స్టేకి తీసుకువచ్చి హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
అమ్మాయిలు ,ఆంటీల డేట్లు, రేట్లు ఫిక్స్
మైసూరు, మండ్య, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి లావుగా, ఎర్రగా, బుర్రగా ఉండే అమ్మాయిలు, వివాహిత మహిళలను పిలుచుకుని వచ్చి వాళ్లను హోమ్ స్టేలో పెట్టి సోషల్ మీడియాలో విటులను ఆకర్షించి ఈ హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని కుశాలనగర పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిలకు ఒక రేటు,, ఆంటీలకు ఒక రేటు అంటూ వారి డేట్లు కూడా ఫిక్స్ చేసి విటులకు సమాచారం ఇచ్చి ఎవ్వరికీ అనుమానం రాకుండా రజనీకాంత్, రాజేష్ పక్కా స్కెచ్ తో ఇంతకాలం ఈ దందా నిర్వహించారని కుశాలనగర పోలీసు అధికారులు అంటున్నారు.