ఢిల్లీలో హనీప్రీత్ సింగ్... ముందస్తు బెయిల్ కోసం పిటిషన్!
కానీ హనీప్రీత్ ఢిల్లీలో మకాం వేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, ఆమె ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఆమె తనతో రోజూ మాట్లాడుతూనే ఉన్నారని, కానీ ఎక్కడుందో మాత్రం తెలియ
న్యూఢిల్లీ: డేరాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ ఢిల్లీలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. సాధ్వీలపై అత్యాచారం కేసుల్లో డేరాబాబాకు జైలుశిక్ష పడిన అంతరం హనీప్రీత్ మాయమైన సంగతి తెలిసిందే.
హర్యానా సిట్ అధికారులు హనీ ప్రీత్ ఆచూకీ కోసం కోసం దేశ వ్యాప్తంగా గాలిస్తున్నారు. ఆమె నేపాల్ కు పారిపోయినట్లు కూడా వార్తలు హల్ చల్ చేశాయి. మరోసారి బీహార్ లో కనిపించిందంటూ పుకార్లు వచ్చాయి.
ఢిల్లీలో హనీప్రీత్ మకాం...
కానీ హనీప్రీత్ ఢిల్లీలో మకాం వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆమె ఢిల్లోనే ఉన్నట్టు చెబుతున్నప్పటికీ... దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఢిల్లీలో ఆమె ఎక్కడ ఉందో ఎవరికీ అంతుబట్టడం లేదు.
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్..
ముందస్తు బెయిల్ దరఖాస్తుపై సంతకం చేసేందుకు సోమవారం హనీప్రీత్ సింగ్ తన కార్యాలయానికి వచ్చినట్టు ఆమె న్యాయవాది ప్రదీప్ ఆర్య వెల్లడించారు. హనీప్రీత్ ఇన్సాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్నట్టు ఆయన పేర్కొన్నారు.
రోజూ మాట్లాడుతున్నా.. ఆచూకీ తెలియదు
హనీప్రీత్ సింగ్ తనతో రోజూ మాట్లాడుతున్నారని ఆమె న్యాయవాది ఆర్య చెబుతున్నారు. అయితే ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారన్న సంగతి మాత్రం తనకు తెలియదని ఆయన పేర్కొంటున్నారు. తన క్లయింటుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మంగళవారం తాను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆర్య పేర్కొన్నారు.
తీవ్ర కలతలో హనీప్రీత్...
‘‘డేరాబాబాను దోషిగా నిర్ధారించడం.. తనకు, గుర్మీత్కు మధ్య అక్రమ సంబంధాలున్నట్టు ప్రచారం చేయడంపై హనీప్రీత్ సింగ్ తీవ్ర కలతకు గురయ్యారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా కోర్టును కోరనున్నాం. ప్రాథమికంగా ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. ఆమెపై అలాంటి అభియోగాలు మోపడం సరైంది కాదు...'' అని ఆర్య వ్యాఖ్యానించారు.