వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పదో తరగతి పరీక్షలకు, గుర్రం పై కూడ వెళ్లవచ్చు
పదోతరగతి పరిక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థిని గుర్రంపై స్వారి చేస్తూ వెళ్లింది. దీంతో చూసే వారినందరని ఆ విద్యార్థి ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆడపిల్లలకు చదువెందుకు అంటూ ఇంకా వారిని చిన్న చూపు చూస్తున్న సమాజం ఉన్న రోజుల్లో కేరళకు చెందిన ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాయడానికి గుర్రం పై వెళ్లింది.
దీంతో ఇదీ గర్ల్ పవర్ అంటూ ఆ బాలిక గుర్రం పై వెళ్లిన వీడియో ను చాల మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ....ఆమే నా హీరో అని అన్నారు. కాగా ఆబాలిక వివరాలు కావాలని ఆయన సోషల్ మీడియా యూజర్లను కోరారు . సో ఈ వీడీయో చూసైనా తల్లి దండ్రులు తమ అభిప్రాయాలను మార్చుకుంటారని పలువురు యూజర్లు అశించారు.
Comments
English summary
a girl student went on horse to write her 10th class final exams in thrissur district ,Kerala
Story first published: Monday, April 8, 2019, 17:11 [IST]