వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాన్పు కోసం ఆసుపత్రికి వెళితే కిడ్నీ కొట్టేశారు

|
Google Oneindia TeluguNews

లక్నో: కాన్పు కోసం ఆసుపత్రికి వెళితే తనకు తెలియకుండానే కిడ్నీ కాజేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిశ్చార్జి అయిన తరువాత తన కిడ్నీ మాయం అయ్యిందని తెలిసిందని ఆమె పోలీసులకు చెప్పారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బారీల్లి నగరంలో నారాయణి (30) అనే మహిళ నివాసం ఉంటున్నారు. గత మార్చి నెలలో నారాయణి కాన్పు కోసం బారీల్లి నగరంలోని రోహిత్ అగ్ని హోత్రి ఆసుపత్రిలో చేరారు.

డిశ్చార్జి అయిన తరువాత అనారోగ్యంగా ఉండటంతో తాను వేరే ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నానని, అప్పుడు కిడ్నీ మాయం అయిన విషయం తెలిసిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hospital steals kidney during childbirth in Uttar Pradesh

అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యజమాని డాక్టర్ సుష్మా అగ్ని హోత్రి ఖండించారు. 30 నిమిషాల్లో ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.

నారాయణి ఆపరేషన్ చేయించుకునే ముందు అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీసుకోలేదని, కాన్పుకు ముందు ఆమెకు రెండు కిడ్నీలు ఉన్నట్లు ఆధారాలు లేవని అంటున్నారు. ఆసుపత్రి పరువు తియ్యడానికి ప్రత్యర్థులు ఇలా చేయించారని ఆమె ఆరోపించారు. కేసు విచారణలో ఉంది.

English summary
Narayani(30) was reportedly referred to Rohit Agnihotri Hospital by a woman who works there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X