సిబిఎస్ఈ పేపర్ లీక్ ఎలా లీకైంది: అడ్మిన్ లేడీ టీచర్?
Recommended Video
న్యూఢిల్లీ: సిబిఎస్ఈ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 35 మందిని ప్రశ్నించారు. వారిలో ఓ కోచింగ్ సెంటర్ (వికీ), 11 మంది విద్యార్థులు, 7గుు ప్రథమ సంవ్సంర విద్యార్థులు, ఐదుగురు ట్యూటర్లు, ఇద్దరు ప్రైవేట్ అధికారులు ఉన్నారు.
వారందరికీ లీకైన ప్రశ్నప్రతం అందినట్లు తెలుస్తోంది. పదో తరగతి లెక్కల పరీక్షకు ముందు రోజు మార్చి 27వ తేదీన ప్రశ్న పత్రం లీకైనట్లు సిబిఎస్ఈకి ఓ ఈమెయిల్ వచ్చింది. పేపర్ లీక్పై పోలీసు కంట్రోల్ రూంకు కూడా ఓ కాల్ వచ్చింది.
దేశవ్యాప్తంగా ఉ్న సిబిఎస్ఈ కార్యాలయాలకు దర్యాప్తులు విస్తరించాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో వాట్సప్ గ్రూప్నకు ఓ లేడీ ట్యూటర్ అడ్మిన్గా వ్యవహరించినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు.
ప్రశ్న పత్రాలను డబ్బులకు విక్రయించారనే ఆరోపణలను పోలీసులు తిరస్కరిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి నుంచి పది నుంచి 15 వేల వరకు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఓ జాతీయ మీడియా వార్తాకథనం తెలియజేసింది.