మైసూరు దసరా ఉత్సవాలు, జంబూసవారి మాత్రమే కాదు, ప్రత్యేక సంగమం !
మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలు అంటే రాజభాగోల ఊరేగింపులు మాత్రమే కాదు. మైసూరు దసరా ఓ చరిత్ర, అదో కల, సాహిత్యం, క్రీడలు, సంసృతి, సాంప్రధాయాలు కలబోసిన ప్రత్యేక సంగమం. కర్ణాటక సంసృతి, సాంప్రధాయాలు, భారతదేశ సంసృతి, సాంప్రధాయాలుకు అద్దం పడుతూ మైసూరు దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆదునిక సాంప్రధాయలకు అనుగుణంగా మైసూరు దసరా ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. మైసూరు దసరా ఉత్సవాలకు నాలుగు దశాభ్దాల చరిత్ర ఉంది. మైసూరు దసరా ఉత్సవాల సందర్బంగా చాముండిదేవిని 9 అవతారాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తారు. మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. చాముండేశ్వరి దేవి మైసూరు మహారాజులు తమ ఇంటి దేవతగా పూజిస్తారు.
అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!
26 కాలాల ఒడయార్ లు
1399 నుంచి 1970 సంవత్సరం వరకు 26 కలాలకు చెందిన ఒడయార్ లు మైసూరు మహా సామ్రాంజ్యాన్ని పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మైసూరు మహా సామ్రాజ్యం ప్రత్యేకంగా ఉండేది. రిపబ్లిక్ డే సందర్బంగా 1970లో మైసూరు మహా సామ్రాజ్యం భారతదేశంలో విలీనం అయ్యింది.
బ్రిటీష్ కాలంలో 9 జిల్లాలు
బ్రిటీష్ కాలంలో మైసూరు మహా సామ్రాజ్యం 9 జిల్లాలు మాత్రమే ఉండేది. 1956 నవంబర్ 1వ తేదీ మైసూరురాష్ట్రం అయ్యింది. దేవరాజ్ అరసు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1973 నవంబర్ 1వ తేదీ మైసూరు రాష్ట్రం కర్ణాటకలో విలీనం అయ్యి అఖిల కర్ణాటకగా అవతరించింది.
బెంగళూరు, మైసూరు రాజధానులు
కర్ణాటక రాజధాని బెంగళూరు. అయితే ఇప్పటికీ కర్ణాటక సాంసృతిక రాజధాని మాత్రం మైసూరు నగరంగా నిలిచిపోయింది. గత నాలుగు దశాభ్దాలుగా మైసూరు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ మైసూరు దసరా ఉత్సవాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నది.
మైసూరు రాజవంశస్తులు
1399లో మైసూరు అరసు వంశస్తులు మైసూరు మహా సామ్రాజ్యం చరిత్రను చాటి చెప్పడానికి శ్రీకారం చుట్టారు. రాజవంశానికి చెందిన యదురాయ, కృష్ణరాయ మైసూరు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానికుల సహకారంతో మైసూరు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మైసూరు దసరా ఉత్సవాల్లో జంబూసవారికి ఓ ప్రత్యేకత ఉంది.