వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనపై తగ్గిన భారం, ప్రభుత్వానికి రెవెన్యూ: జీఎస్టీ వల్ల సామాన్యునికి ఎలా లాభం కలిగింది?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో నోట్ల రద్దు, జీఎస్టీ ఉన్నాయి. నాలుగున్నరేళ్లలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోంది. జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) కారణంగా దేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరింది.

<strong>కేబినెట్ మంత్రులు సహా 100 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ షాక్, నో టిక్కెట్</strong>కేబినెట్ మంత్రులు సహా 100 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ షాక్, నో టిక్కెట్

జీఎస్టీని అమలు చేయడం వల్ల నిత్యావసర వస్తువులపై పరోక్ష పన్నులు తగ్గాయి. ఇది వినియోగదారులకు ముఖ్యంగా మధ్యతరగతికి ఎంతో ఊరటను ఇచ్చే అంశమే. జీఎస్టీ కారణంగా సబ్బులు, టూత్‌పేస్ట్, హెయిర్ ఆయిల్, రేజర్లు, షాంపూ, డియోడోరెంట్ తదితర వస్తువులపై పరోక్ష పన్ను 26 శాతం (ఎక్సైజ్ ప్లస్ వ్యాట్) నుంచి 18 శాతానికి తగ్గిపోయింది.

జీఎస్టీతో మధ్యతరగతికి ఊరట

జీఎస్టీతో మధ్యతరగతికి ఊరట

చెప్పుల ధరలు అయితే దాదాపు సగానికి తగ్గాయి. ఎంవోఎస్పీఐ కన్సంప్షన్ బాస్కెట్ డాటా ప్రకారం కేవలం నిత్యావసర వస్తువులే కాకుండా సుగంధ ద్రవ్యాలు, ధరలు కూడా ఆరు శాతం నుంచి ఐదు శాతం వరకు తగ్గాయి. ఇడ్లీ దోశ వంటివి 12 నుంచి 5 శాతానికి తగ్గాయి. రోటీ 12 నుంచి 5 శాతం, మినరల్ వాటర్ 27 నుంచి 18కి తగ్గాయి. అంతేకాదు, పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబం కలిసి లగ్జరీ ఆహారం కోసం వెళ్లడం ఖరీదైనదిగా కనిపించడం లేదు.

ఎన్నో వస్తువులపై రేట్లు తగ్గాయి

ఎన్నో వస్తువులపై రేట్లు తగ్గాయి

జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత, కేంద్రం ధరలను ఖరారు చేసిన తర్వాత దాదాపు 33 శాతం వస్తువులు, సేవలపై రేట్లు తగ్గాయి. జీఎస్టీ కారణంగా భవిష్యత్తులో రెవెన్యూ పెరగనుంది. ఈ ఏడాది జూలై 27న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన సోషల్ మీడియా బ్లాగ్‌లో జీఎస్టీ గురించి పేర్కొన్నారు. గత ఏడాదిగా 384 వస్తువుల ధరలు తగ్గాయని, ఒక్క ఉత్పత్తి పైన పెరగలేదని చెప్పారు.

సామాన్యులకు తగ్గిన భారం, పెరిగిన రెవెన్యూ

సామాన్యులకు తగ్గిన భారం, పెరిగిన రెవెన్యూ

అరుణ్ జైట్లీ ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ఇంత పెద్ద మొత్తంలో ట్యాక్స్ తగ్గింపు (జీఎస్టీ కారణంగా) స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కనలేదని పేర్కొన్నారు. అదే సమయంలో ధరలు తగ్గుతూ, రెవెన్యూ పెరిగిందని, ఇది మంచి ఫలితమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జీఎస్టీ కారణంగా వచ్చే తగ్గింపుకు తోడు పండుగల సీజన్లలో రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు, చిన్న టెలివిజన్లు తదితర వస్తువులపై 10 శాతం తగ్గింపుకు వస్తోంది. ఆ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

జీఎస్టీ పరోక్ష పన్ను

జీఎస్టీ పరోక్ష పన్ను

జీఎస్టీ అనేది వస్తువులు, సేవలపై విధించిన పరోక్ష పన్ను. వినియోగదారుడు మినహా ప్రతి దశలో చెల్లించే పన్ను. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ఐదు స్లాబ్‌లుగా ఉంది. 0%, 5%, 12%,18%, 28%గా ఉంది. పెట్రోలియమ్ ఉత్పత్తులు, అల్కాహాల్ (మద్యం), ఎలక్ట్రిసిటీ వంటివి జీఎస్టీ పరిధిలో లేవు. గతంలో వలె రాష్ట్ర ప్రభుత్వలు వాటిపై ట్యాక్స్ విధిస్తున్నాయి.

English summary
The Indirect taxes on essential commodities has been reduced substantially due to the implementation of Goods and Services Tax (GST). Indeed, a boon for end consumer, especially, middle-class people in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X