శుభవార్త: మిస్డ్కాల్తో పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు, ఎస్ఎంఎస్ కూడా
న్యూఢిల్లీ: పిఎఫ్ బ్యాలెన్స్ను ఒక్క మిస్డ్ కాల్తో తెలుసుకొనే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పీఎఫ్ బ్యాలెన్స్ను ఎంత ఉందో తెలుసుకొనేందుకు వీలు కల్పించింది. మిస్డ్ కాల్ చేస్తే పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకొనే అవకాశం ఉంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ స్కీమ్లోని ఉద్యోగులు ఎవరైతే యూనివర్శల్ అకౌంట్ నెంబర్ పోర్టల్లో కూడ రిజిస్టరై ఉంటారో వారికి ఈ సేవలు అందుతాయి. బ్యాంకులో నగదు నిల్వ సమాచారాన్ని తెలుసుకొన్నట్టుగానే పీఎఫ్ బ్యాలెన్స్ ను కూడ తెలుసుకొనే వెసులుబాటును కల్పించింది కేంద్ర కార్మిక శాఖ.
యూఏఎన్ పోర్టల్లో ఉద్యోగులు పేర్కొన్న తమ ఫోన్ నెంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ చేస్తే చాలు ఆ పీఎఫ్ నెంబర్లోనే బ్యాలెన్స్ తేలుతోంది. ఎస్ఎంఎస్ ద్వారా ఈ వివరాలు అందుతాయి.
అయితే ఈ సర్వీసుకు ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కార్మిక శాఖ ప్రకటించింది. రిజిస్టరైన మొబైల్ నుండి EPFOHO UAN అని టైప్ చేసి7738299899 అనే నెంబర్కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా వివరాలు పొందవచ్చని కార్మిక శాఖ ప్రకటించింది. ఈ సౌలభ్యం సుమారు 8 భారతీయ భాషల్లో అందుబాటులోకి