ABP-CVoter Opinion Poll: మిథిలాంచల్లో వార్ వన్ సైడే.. నితీశ్ కూటమికి 41 శాతం..
బీహర్లో ప్రజల మూడ్ ఎలా ఉండబోతుందో ఏబీపీ సీ ఓటర్ ఒపినీయన్ పోల్ చెప్పింది. నితీశ్ సీఎం 29 శాతం అంగీకరిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని ఓ భాగం మిథిలాంచ్లో పరిస్థితి ఎలా ఉందనే అంశాన్ని కూడా సర్వే రివిల్ చేసింది. ఇక్కడ ఎన్డీఏకు మెజార్టీ ఓటర్లు మద్దతు తెలపడం విశేషం.
మిథిలాంచల్లో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ 41.0 శాతం ఓట్లతో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తోందని పేర్కొన్నది. అంటే కూటమి 27 నుంచి 31 సీట్లు గెలుచోకోబోతుంది. అయితే మహాగడ్బందన్ మాత్రం 38 శాతం ఓట్లతో వెనకాలే ఉంటుందని వివరించింది. ఈ కూటమి 18 నుంచి 21 సీట్లను గెలుచుకోనుంది. అయితే ఎల్జేపీ మాత్రం 4 నుంచి ఓట్లు రాబట్టుకోగలుతోందని తెలియజేసింది. పార్టీ 1 నుంచి 3 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. ఇతరులు 17 శాతం ఓట్లు సాధించనున్నారు. అయితే వారు ఒక సీటు వరకు మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది.
Recommended Video
బీహర్లో మూడు విడతల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తొలి విడత ఎన్నిక 28వ తేదీన జరగబోతుంది. మరో రెండు విడతల పోలింగ్ తర్వాత.. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. వయోజనులను ఆకట్టుకొనేందుకు పార్టీలు మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల పేరుతో ఆశలు కల్పిస్తున్నారు.