ఉత్తరాఖండ్ జలప్రళయం: 10 మంది మృతి, 170 మందికిపైగా గల్లంతు, 2 ప్రాజెక్టులు, 5 వంతెనలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఛమోలి జిల్లాలో భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 170 మంది కార్మికులు, ప్రజలు ధౌలిగంగా, అలకనంద నదీ ప్రవాహంలో గల్లంతైనట్లు వెల్లడించారు. వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి.
Recommended Video
జోషిమఠ్ వద్ద భారీగా వరద రావడంతో కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే. కొండచరియలు, హిమానీనదాలు విరిగిపడటంతో నదులలో పడటంతో ఒక్కసారిగా నీటిమట్టం పెరిగిర భారీ వరదలు సంభవించాయి. దీంతో రెండు విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఓ డ్యాం పూర్తిగా కొట్టుకుపోయింది.
వరదల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి సహాయక బృందాలు. ఆర్మీ, ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎస్, ఐటీబీపీ ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 16 మందిని సహాయక సిబ్బంది కాపాడారు.
వరదల కారణంగా అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. పలు ఇల్లు ధ్వంసమయ్యాయి. నదీ ప్రవాహం భారీగా రావడంతో ఐదు వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు10 మంది మృతి చెందగా, ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న 170 మంది వరకు కార్మికులు కొట్టుకుపోయారు.
Indian Air Force shares recce initial report from site of Uttarakhand flash flood
— ANI (@ANI) February 7, 2021
Visuals from broken Rishiganga Project Dam near Tapovan (pic 1), road & bridge broken due to Rubble at entrance at Malari valley (pic 2)
(Pic source-IAF) pic.twitter.com/4xmMJ1uGL7
భారీ వరద ఘటనపై ఇప్పటికే ప్రధాన నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మాట్లాడారు. దేశం యావత్తు ఉత్తరాఖండ్ ప్రజలకు అండగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. గల్లంతైన వారంతా క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించినట్లు అమిత్ షా తెలిపారు.