వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జలప్రళయం: రెండేళ్ల తర్వాత కేదార్‌నాథ్‌లో వెలుగు చూసిన మనిషి పాదం

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లో జలప్రళయంలో మరణించిన వారి అవశేషాలు ఇప్పటికీ బయటపడుతున్నాయి. హిమాలయాలలోని కేదారనాథ్ దేవాలయం సమీపంలో మరణించిన ఓ వ్యక్తి కాలి పాదం బయటపడింది. శిథిలాల కింద ఇంకా చాలా మంది అవశేషాలు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.

2013వ సంవత్సరం జూన్ లో హిమాలయ పర్వతాల పాద ప్రాంతాలను జల ప్రళయం ముంచెత్తింది. ఆ సందర్బంలో కొన్ని వేల మంది చనిపోయారు. చనిపోయిన కొన్ని వందల మంది మృతదేహాలు చిక్కలేదు. చాలా కాలం మృతదేహాల కోసం గాలించిన అధికారులు తరువాత లాభం లేదని వదిలేశారు.

Human Remains Founds in Kedaranath after two Years

ఈ ఘటనతో సుమారు 60 అడుగుల ఎత్తులో రాళ్లు, బురద, చెత్త చెదారం పేరుకుపోయాయి. ఈ శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని మరణించారని అప్పట్లో అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ శిధిలాలను తొలగిస్తున్నారు.

శనివారం స్థానికులు కేదారనాథ్ ప్రధాన ఆలయం సమీపంలోని 50 మీటర్ల దూరంలో శిథిలాలు తొలగించారు. ఆ సందర్బంలో మరణించిన వ్యక్తి పాదం బయటపడింది. పాదానికి అదే రోజు డీఎన్ఏ పరిక్షలు నిర్వహించి తరువాత పూడ్చివేశారు. శిథిలాలను తొలగిస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు.

English summary
The remains of a human foot were sighted on Saturday as some locals were clearing debris from a structure in a narrow bylane about 50 metres from the Himalayan shrine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X