భారీ ఎన్కౌంటర్: ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం, హురియత్ ఛైర్మన్ కొడుకు కూడా
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ అమరుడయ్యారు.
మరో పోలీస్ అధికారి, సీఆర్పీఎఫ్కు చెందిన ఓ జవాను గాయపడ్డారు. భారత భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ ఛైర్మన్ అష్రఫ్ సెహ్రాయి కుమారుడు, హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ సెకండ్ టాప్ లీడర్ జునైద్ సెహ్రాయి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మంగళవారం వేకువజామున 2 గంటల సమయంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బద్ సింగ్ వెల్లడించారు. కాశ్మీర్లోని నవాకడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ప్రవేశించారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.
ఈ క్రమంలో నవాకడల్ ప్రాంతంలో రెండు ఇళ్లలో నక్కిన ఉగ్రవాదులు భారత భద్రతా దళాలపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు షెల్టర్ తీసుకున్న ఇళ్లను భద్రతా దళాలు పేల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
The other terrorist (Tariq) had joined Hizbul Mujahideen in March and was killed in the encounter last night. Junaid was wanted in multiple criminal cases. He was the divisional commander of Hizbul Mujahideen & was looking after central Kashmir area too: Jammu & Kashmir DGP https://t.co/GNKtrtSUCx
— ANI (@ANI) May 19, 2020
తప్పించుకున్న మరికొంత మంది ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, నవాకడల్ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
Recommended Video
ఇటీవల జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు కూడా అమరులయ్యారు. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న వేళ పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని మనదేశం ఎదుర్కొంటోంది. అటు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే.. పాక్ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. భారత సైన్యం వీరికి గట్టి జవాబే ఇస్తూ వస్తోంది.