చికెన్ వండని భార్యను భర్త ఏం చేశాడో తెలుసా..
శివమొగ్గ :తనకు ఇష్టమైన కూర వండడంలో భార్య ఆలస్యం చేసింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయస్థితిలో ఆమె ఆసుపత్రిలో చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతోంది.
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లోని ఈధానగర్ లో సురేష్, ఆశారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. సురేష్ మద్యానికి బానిసగా మారాడు.సోమవారం నాడు మద్యం తాగి వచ్చిన సురేష్ భార్యను చికెన్ వండాలని ఆదేశించాడు.చికెన్ తెచ్చి భార్యకు ఇచ్చాడు.
సురేష్ ఇంటికి వచ్చేసరికి భార్య చికెన్ కూర వండలేదు.దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్యతో సురేష్ గొడవకు దిగాడు. ఆమెను చావబాదాడు అప్పటికీ అతని కోపం చల్లారలేదు. చికెన్ వండకుండా ఏం చేస్తున్నావంటూ భార్య గొంతు కోశాడు.
భర్త గొంతు కోయడంతో భార్య కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు.పోలీసులు సురేష్ ను అదుపులోకి తీసుకొన్నారు. స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. భాదితురాలి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు ప్రకటించారు.