భర్త, నల్లగా ఉన్నాడని కాల్చి చంపిన భార్య !
సాధరణంగా భార్యలను చిత్రహింసలకు గురి చేసి చంపే భర్తలను చూశాము , ముఖ్యంగా భార్యలు అందంగా లేరని వారిని వేధించడంతోపాటు అవసరమైతే ఇంకో పెళ్లి చేసుకోవడం లేదా వారిని కడతేర్చడమో జరుగుతుంటుంది. ,కాని ఉత్తర ప్రదేశ్ మాత్రం ఇందుకు విరుద్దంగా ఓ సంఘటన జరిగింది. యూపిలోని బరైలిలో ఓ భార్య తన భర్త నల్లగా ఉన్నాడనే కారణంతో పడుకున్న భర్తకు నిప్పంటించింది. దీంతో భర్త అక్కడికక్కడే చనిపోయినట్టు యూపి పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భరైలీ లో ప్రేమ్ శ్రీ అనే మహిళ, పడుకుని ఉన్న సత్యవీర్ సింగ్ ను నిప్పంటించి కాల్చి వేసిందని చెప్పారు.కాగా వారికి పెళ్లయి రెండు సంవత్సరాలు అవుతుండగా వారికి 5 నెలల అమ్మాయి కూడ ఉంది. కాగా పెళ్లయినప్పటి నుండి భర్త నల్లగా ఉన్నాడని ఆమే వేధింపులకు గురి చేసినట్టు మృతుడి సోదరుడు పోలీసులకు తెలిపారు.అయితే ఇంతటి దారుణానికి పాల్పడుతుందని ఊహించలేదని అన్నారు.కాగా ఆమే 307 చట్టం క్రింద కేసు ఫైల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా భర్తకు నిప్పంటించిన ప్రేమ్ శ్రీ కూడ కాళ్లకు గాయాలయ్యాయి చికిత్స పోందుతోంది.