నేను మంత్రిని...లైనులో ఎందుకు నిలబడతాను
లక్నో :ఆయనో మంత్రి. నగదు మార్పిడి ఆయనకు సమస్యను తెచచ్చిపెట్టింది.దీంతో సామాన్యుడి మాదిరిగా ఆయన బ్యాంకు లైనులో నిలబడలేదు. బ్మాంకు ఉద్యోగులు ఆఘమేఘాల మీద మంత్రి పనులు చేసి పెట్టారు.లైన్ లో నిలబడాల్సిన అసరం తనకేంటీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
పెద్ద నగదు నోట్ల రద్దుతో కొత్త కరెన్సీ కోసమో...నగదు మార్పిడి కోసమో ప్రజలు బ్యాంకులు, ఎటిఎం ల చుట్టూ తిరుగుతున్నారు.దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి బ్యాంకులో నగదు మార్పిడి చేసుకొన్న తర్వాత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఉత్తర్ ప్రదేశ్ పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్న ఇక్బాల్ మొహామద్ శుక్రవారం నాడు తన సన్నిహితులు, కుటుంబసభ్యులతో కలిసి సంబాల్ లోని బ్యాంకుకు వెళ్ళాడు. బ్యాంకు సేవల కోసం ఎదురుచూస్తున్న సామాన్య జనాన్ని కాదని మంత్రి రాగానే బ్యాంకు సిబ్బంది సాదరంగా ఆయన్ను ఆహ్వనించారు. ఆయన నగదును మార్పిడి చేసి ఇచ్చారు.
బ్యాంకులో తన పనిని ముగించుకొని వెళ్తూ లైన్ లో నిలబడాల్సిన పని తనకేంటీ అని వ్యాఖ్యానించాడు. ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. క్యా లైన్లలో ఉంటూ ఏ రకగా ఇబ్బంది పడుతున్నారో వారి సాధకబాదకాలు తెలుసుకోకుండా మంత్రి వ్యవహారించిన తీరు వివాదాస్పదమైంది.
ఆయనో మంత్రి. నగదు మార్పిడి ఆయనకు సమస్యను తెచచ్చిపెట్టింది.దీంతో సామాన్యుడి మాదిరిగా ఆయన బ్యాంకు లైనులో నిలబడలేదు. బ్మాంకు ఉద్యోగులు ఆఘమేఘాల మీద మంత్రి పనులు చేసి పెట్టారు.లైన్ లో నిలబడాల్సిన అసరం తనకేంటీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.