నేను ఆ రెండింటి బాధితురాలిని: డీఎస్పీ అనుపమ
బెంగళూరు: కర్నాటక వ్యాప్తంగా కూడ్లిగి డిఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామా సంచలనం రేపింది. దీనిపై తాజాగా ఆమె పెదవి విప్పారు. గురువారం నాడు ఆమె మాట్లాడుతూ... తాను వ్యవస్థ, పురుషాధిక్య వ్యవస్థ, అవినీతి రాజకీయాలకు బలైన బాధితురాలినని వ్యాఖ్యానించారు.
కర్ణాటక మహిళా కమిషన్ సభ్యుల ముందు తన వాదనలు వినిపించిన అనంతరం ఆమె మాట్లాడారు. బళ్లారి ఎస్పీ చేతన రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పని చేయాలంటూ వేధింపులకు గురి చేసేవారన్నారు. మంత్రి ఒత్తిడి వల్లే ఆమె రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
డీఎస్పీ అనుపమ కేసు, మరో ట్విస్ట్: ఎస్పీ వేధింపులు
పురుషాధిక్య సమాజంలో అవినీతి రాజకీయాలకు మహిళా ఉద్యోగులు వేధింపుల బారిన పడకుండా తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఉద్యోగంలో మనశ్సాంతి లేకుండా పోయిందని, ఇప్పుడు అది దొరికిందన్నారు. పురుషుల ఆలోచనల ప్రకారమే నడుస్తోందన్నారు.
తనకు ఉద్యోగం ఎలాంటి మానసిక ప్రశాంతతను ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం తనకు దొరికిందన్నారు. కాగా, ప్రాథమిక విచారణ అనంతరం తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్టు మహిళా కమిషన్ సభ్యులు తెలిపారు.
డిఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామాలో కొత్త ట్విస్ట్
కాగా, కుడ్లిగి డీఎస్పీగా పని చేసిన అనుపమ షణై మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఆమె విసిరిన సవాళ్లతో ఆయన మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నారు.